పుట:Dvipada-Bagavathamu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్యాణకాండము

91

వాఁడు మహాశక్తి వైచిన మరుఁడు
పొడిగాగ నది ద్రుంచెఁ బుడకచండమున.
అప్పుడయ్యసుర మహాబలం బొదవ
నుప్పరం బెగసి పై నురగమై పడిన
గరుడుఁడై యాపాము ఖండించె మరుఁడు ;
తిరుగక దనుజుఁడు ధీరుఁడై పేర్చి
వనదమైఁ పాషాణవరుషంబుఁ గురియ
ననిలుఁడై విరియించె, నద్రియై పడిన
కులిశమై దునుమాడె, కొంకక వాఁడు
కలుషించి కేల ఖడ్గము నెత్తుకొనుచు310
బలువిడిఁ గవిసిన భావసంభవుఁడు
తలఁ ద్రెవ్వనేసె నుద్ధతకోపుఁ డగుచు,
దేవసంఘము లార్చె దివిఁ బుష్పవర్ష
మావిష్ణుతనయుపై నందంద కురిసె.

ప్రద్యుమ్నుఁడు సతితోఁగూడ ద్వారవతికి వచ్చుట


అసుర నీగతిఁ దెగటార్చి, వానింటి
వసురత్నభూషణావళులెల్లఁ గొనుచు
నంతరిక్షంబున నాద్వారవతికి
గాంతాసమేతుఁడై కంతుఁ డేతెంచె.
అంతట బురజనులందఱుఁ జూడ
నతంత శౌరి గృహంబున నిలువ
వైదర్భి దగ్గఱవచ్చి యీక్షించి
యాదవాన్వయజాతు నాజానుబాహు
నీలనీలాంగు నున్నిద్రాంబుజాక్షు