పుట:Delhi-Darbaru.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

366

దర్బారుల చరిత్రము.


నొప్పుకొనిరి. దీని కన తరము దిగ్విజయ పరిపూర్తినిసం కేతించు యజ్ఞము నడచెను. దాని నిటవర్ణించు టనవసరము. అదినడచి నంత కాలమును నట చేశిన సర్వ జనులును సార్వభౌముని యతిథు లకు సమానంబుదిగి. దాని ముగి పుసమయమున “సామ్రాజ్య పదస్థుఁడైన యుధిష్ఠిరుండు భూసుర దీనానాథ ప్రముఖపాత్ర బు లకు వివిధధనంబు లొసంగెను. ” ఈషదముల ప్రయోగముఁబట్టి. ధర్మరాజు చక్రవక్తియును దన ప్రజకు నుత్త మవరము లొసంగె నని యూహింపవచ్చును.

ఔరంగ జేబుషట్టాభి షేకము.

యుధిష్ఠిరునకుఁ దరువాత ఢిల్లీ నగరమున పట్టభద్రు లయిన సార్వభౌములలో మొగలాయీలు ముఖ్యులు. అందును ఔరంగ జేబు ' సింహాసనారోహణోత్సవము ' వర్ణనీయము. సింహాసనారోహణోత్సవము' అను పదముపయోగించుట మహ మ్మదీయ చక్రవర్తుల కాలమునందలి పట్టాభిషేకోత్సవమునకును ఇతర కాలములందలి పట్టాభి షేకోత్సవములకును గల తారతమ్య మును సూచించు నుద్దేశముతోడ ననిగ్రహి చునది. మహమ్మదీ యులయుత్సవమున ముఖ్యతమభాగము చక్రవర్తి సింహాసనము పయిఁగూర్చుండుటయె. అభి షేకముగాని కిరీటమును ధరించుట గాని వారికాచారముగాదు. ఔర గ జేబు 1658 వ సంవత్సర మున రాజ్యమునకున చ్చెను. కానియతఁడు సర్వశత్రువులనడచి 1659 వ సంవత్సరమున సింహాసనారోహణోత్సనము జరిపెను.