పుట:Delhi-Darbaru.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధర్మరాజు నశ్వమేధము.

365


స్వకాయకష్టము త్తమమని చూపుటకును రాజును హలికునితో సమానుఁడయని . చాటుటకును సంతకంటె బలమగు నుదా హరణము కాన లెనా?

ఇట్లు యజ్ఞ భూమి సంస్కరింపఁబడిన తరువాత నట చేరిన రాజులును వారి కళత్రములును ప్రసవగంధ పూజితము లయిన స్వర్ణ కుంభములను మోసి కొనిపోయి జాహ్ననీతోయ ములను గొనివచ్చిరి. అంతకుమున్నె ధౌమ్యుఁడు ఆలంకృతనుగు వేది కాతలంబున నుత్కృష్ట సన్నాహములతో భద్రపీఠంబు ఒక దానిఁ బ్రతిష్ఠించియుండెను. యమునాజలములు సంసిద్ధ మైనతోడనే యుధిష్టురుఁడు మంగళారావములతో గొని తేఁబడి ఆపీఠంబున నుండనియోగింపఁబడియెను. శోభ నాలం కరణము వలన నభిరామయయియుండిన పాంచాలిని అతని వామపార్శ్వ మున నాసీనఁ జేసిరి. అంత శుభముహూర్తంబగును మహాను భా వుఁడు కృష్ణుడు. అదివఱకు సంస్కారమందియుండిన శంఖమునం చుదకములనించి “పృథివిక ధిపతివిగమ్మ"ని జాయా సహితుఁడగు ధర్మజునకు అభిషేక మొనర్చెను. శంఖానక దుంధుభి ప్రభృతి మంగళ తూర్యరావంబులును వీర నాదంబులును చెలంగెను. అచ్చటఁ జేరిన రాజలోకంబును బెద్దలును కలశములలోని పవిత్రాంబువులతో ధర్మరాజు నభి షేకించిరి. ఇదియే ఆయాగ మున మనకు ముఖ్య భాగము. ఈయభి షేకమువలన నె సర్వ సాముతులును ధర్మరాజు సార్వభౌమత్వమును సంపూర్ణముగ