పుట:Delhi-Darbaru.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఔరంగ జేబు పట్టాభి షేకము,

367


ఆసంవత్సరము మేనెల 12 వ తేది సార్వభౌముఁడైన యారంగ జేబు గొప్పయూ రేగింపుతో ఢిల్లీ నగరమును జొచ్చెను, భేరీ మృదంగ కాహళముల శబ్దములతో భూనభోంతరాళములనిం చుచు సేవకా బృందంజులు ముందునడచె. వాని వెనుక మఖు- మలుతోడను వెండి బంగారు జరీలతోడను చకచకలీను మణుల' తోడను నలంక రింపఁబడిన ఝూ లులతో గప్పఁబడిన మదగజం బులు రజతశృంఖలములకు వేలు సువర్ణకింకిణులు మొరయ మంద గమనంబున బారులుదీరి ఏగుదెంచుచుండెను. అవ్వానిమీఁద సార్వభౌమచిహ్నంబులయిన గోళములతో గూడిన టెక్కె ములు మోసికొని భటులుగూర్చుండియుండిరి. ఈఏనుంగులకు వెనుక బంగరుజీనులతోడను అలంకరింపఁబడిన కళ్లెపువారుల తోడను మెప్పుపారశీ కాశ్వములును అరబ్బీ హయములును వరుస దీరియుండెను. వాని వెంబడి కరుణుల మొ త్తంబులును లొట్టి పిట్టతండంబులునునుండె. దీనిపిరుంద ధగధగలీను ఉత్తమాయుధ ముల ధరించిన కాల్బలములు పటాలములు పటాలములుగ నే నడచుచుండెను. వీని వెంక ప్రభువులును మంత్రులును గుంపులు సూడి చుట్టుఁగొలున నెల్లర దృష్టులనాకర్షించుచు నచ్చటిజనంబు లందఱుకును విభుండయిన గరంగ జేబు తనగజశాలయందలి యు తమ భద్రేభంబు పైనునిచిన బసిఁడి యం బారియం దాసీనుఁ డయి యే తేరుచుండె. ఇట్లూ రేగింపుతో దరలి యారంగ జేబు ఢిల్లీ కోటయందు