టి ప్పూ సుల్తా ను.
311
యమున నాగ్లేయులు వీరిని దల పెట్టవలసిన వారయిరి. టిప్పూ రాజ్యమును దామును నైజామును విభజించుకొన యత్నించిన పక్షమున మహారాష్ట్రులకుఁ దప్పక ఈర్ష్యజనిం చును. అంతమాత్రమె గాదు. నైజామునకు విశేషమగు భూభాగము " చేరిపోయి అతని శక్తి యెక్కుడయి పోవును. అది అప్పటి స్థితిలో ఆంగ్లేయ ప్రభుత్వము వారి కంతఫలప్రద ముగాఁ గనించ లేదు. కావున మిక్కిలి యోచనమీఁద మైసూరు మండలమునందుఁ బూర్వహిందూ రాజ వంశమును నెలకొల్పునట్లును టిప్పునకు సంబంధించిన ఇతర దేశ భాగమును దామును నైజామును మహారాష్ట్రులును విభజించుకొనునట్లు ను సైజూముతో 1799 లో చేసికొనిన సంధివలన ఏర్పఱుప బడెను. అందుచే 'బూర్వ హిందూ వంశమునకుఁ జేరిన కృష్ణ రాజ ఒడయరు. ఐదు సువత్సరముల బాలుఁడు మైసూరునకు రాజుగా నేమింపఁబడెను. అతనితో నదే తరుణమున ఒక సాహాయ్యసంధి (Subsdiary treaty.) తీర్చు కొనఁబడెను. ఈసంధివలన మైసూరునం దాంగ్లేయులు మహారాజునకు సాహాయ్యర్థము హైదరాబాదు మొదలగు ఇతర సంస్థానము లందు వలెనే సాహాయ్య సైన్యమును నిలుప నిర్ణయించుకొనిరి. దానికగు వ్యయమునకు గాను మైసూరు రాజు సంవత్సరమున కేడులక్షల పూలవరహాల -నియ్యనంగీక రించెను. ఇతర రాష్ట్ర ములతోఁ బోరుక లిగినప్పుడు ఆంగ్లేయుల సాయమున కై వలసిన