పుట:Delhi-Darbaru.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

340

మైసూరు రాజ్యము.


త్తరములు జరిగెను. కాని నెపోలియను నావిక సై న్యము“ నెల్సను' అను ఆంగ్లేయ నావికావీరునిచే నోడింపఁబడినమీ దట నెపోలియను దూర్పు దేశముల పైకి నచ్చు నుద్యమము మానుకొనవలసి వచ్చెను. టిప్పూసుల్తాను చర్యలనంతటినిగని పట్టి యుండిన గవర్నరు జనరలు అతనిని .సమాధాన మడిగెను. అతఁడును సరియయిన ప్రత్యుత్తర మీయనందున అతనిపై విగ్రహము చాటింపఁబడెను.నైజామును మహా రాష్ట్రులును టిప్పూసుల్తాను గెలిచినచో నతఁడు దమ్ము నెచ్చట మ్రింగి వేయు నోయను భయమున నాంగ్లేయుల పరమయిది. విగ్రహము ప్రారంభమయ్యెను. ఒకటి రెండు యుద్ధములకుఁ దరువాత నాం గ్లేయులు శ్రీరంగపట్న మును మట్టడించిరి. టిప్నూ సంధి చేసికొ నుటకుఁ బ్రయత్నించెను. కాని రెండు పక్షములవారికిని షర తులు కుదిరినవి కావు. కావున ముట్టడి బలముగ సాగదొడఁగి 1799 వ సంవత్సరము మే నెల 4 న తేది శ్రీరంగపట్నము ఆంగ్లేయుల చేతఁ జిక్కెను. టిప్పూసుల్తాను యుద్ధమున బహు సాహసముతోఁ బోరి మడిసి పడి యుండెను. ఆతనితో మైసూరు నందు మహమ్మదీయ రాజ్య మంతరించి పోయెను. ఈవిగ్రహమున నాంగ్లేయులకు సాయము చేసిన స్వదేశీయ పరిపాలకుఁడు నైజామొక్కరుఁడె. మహారాష్ట్రులు యుద్ధ రంగమున కే రా లేదు. కాని టిప్పూసుల్తాను పరాజితుఁడయి మృతినొందిన తరువాత నాతని దేశమును బంచుకొను సమ