పుట:Delhi-Darbaru.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

342

మైసూరు రాజ్యము.


సైన్యముల కగువ్యయమునుగూడ గవర్నరు జనరలుగారి తీర్మా నము చొప్పున మైసూరు రాజు భరింప వలసి యుండుననియు నొక షర్తు ఈసంధిలోఁ జేర్పఁబడియెను. అయిన నీషర్తు 1807 న సంవత్సరమున మార్పునం దెను. అప్పుడు మైసూరు సైన్య మేర్ప డెను.అది యే ఆంగ్లేయుల సాయమునకుఁ గాను కొన్ని నిబంధనల ననుసరించి ఉపయోగింప నియమింపఁబడెను. ఈ రెండు సేనలకు అనగా సాహాయ్య సైన్యమునకును మైసూరు సైన్యము:నకును అగువ్యయములు రాజు భరింపనంతటి స్థితికి వచ్చినచో ఆంగ్లేయ ప్రభుత్వమువారు పరిపాలనా పద్ధతులను మార్చియో కొంత దే శమును ఆక్రమించుకొనియో లేక సర్వమును తమ యాధి పత్యమునకు మార్చుకొనియో తమ చిత్తమునకు వచ్చినట్లు ప్ర వర్తింపఁగలరనియు అట్లు రాజ్యము తీసికొనఁబడినచో రాజునకు సంవత్సరమునకు ఒకలక్ష రూపాయిలును రాజ్యపునిక రాదా యములో ఐదనవంతును ఇయ్యఁబడుననియును ఈ సంధవలనఁ దీర్మానింపఁబడెను.

పూర్ణయ్య

కృష్ణ రాజ ఒడయరు బాలుఁడుగ నుండినందున ఈ సంధి పత్రములో అతనివ్రాలును అతని తల్లి వ్రాలును దివాను పూర్ణయ్య వ్రాలును గానవచ్చుచున్నవి. ఇట దివాను పూర్ణయ్య ఎవ్వరయినదియు మాచదువరు లొకకొంత ఎఱుంగుదురుగాత. ఇతఁడు కోయంబుత్తూరు జిల్లాలోని యొకమాధ్వవంశమునకుఁ