పుట:Delhi-Darbaru.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

332

మైసూరురాజ్యము.

ఇట్లు


నంజ రాజును వదలించిన తరువాత నతఁడు చేయుచుండిన సర్వ కార్యములకును హైద రే నియమింపఁబడెను.

ఇతఁడు చదువు వ్రాత లేమియు నెఱుగని వాఁడు. కాని జ్ఞాపక శక్తియు, యోచనాదార్థ్యమును గలవాడు. అందుచే నీతఁడు మొదటినుండియు ఖండేరావు అను మహారాష్ట్ర బ్రాహ్మ ణుని చదువరిని వెంటఁ బెట్టుకొని పనులు నెరవేర్చుకొనుచు వచ్చెను. ఆతఁడు గొంత ద్రోహము చేయ సెంచుటచే హైదరతనిని మాయోపాయమునఁ దీర్చి వేసెను. యెవ్వరును దలయె త్తికొని తిరుగఁగల వారు లేక పోవుటనలన సర్వశక్తులును హైదరున కే చేజిక్కెను. మహారాష్ట్రులును శీరానవాబును మైసూరు పై పలుమారు దాడి వేడలు చుండు టవలనను మైసూరు సైన్యములను అదపులో నుంచుకొ నవలసి వచ్చినందనను ఆర్థిక సైనిక స్వాతంత్ర్యమంతయును హైదరుదే యయ్యెను. నాఁటినుండియు "హైదరు పేరునకు మాత్రము దళవాయియే యైనను నిజమునకు స్వతంత్రుఁ డే యయి రాజ్యభారము నిర్వహించుచు రెండన కృష్ణ రాజు మృతి చెందిన మీఁదట నతని స్థానము: మఱిఒక వసివానిని తానే నేమిం చెను. హైదరు రాజు నేర్పఱ చుటం గురించి ఈ క్రింది కథ చెప్పఁబడుచున్నది.

హెదరురాజు నేరుట.

రెండవ కృష్ణ రాజు మరణానంతరము రాజు పదమునకుఁ