పుట:Delhi-Darbaru.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హైదరు ప్రభుత్వము.

333


బుట్టుక వలన అర్హతగల బాలు రెల్లరును గొలువు కూటము నకు రానియోగింపఁబడిరి. వారు వచ్చి చేరునప్పటికి ఆస్థానము, మిఠాయి, పండ్లు, కాయలు, పూలు, ఆటవస్తువులు, పుస్తక ములు మున్నగు పదార్థములతో నింపఁబడి యుండెను. వారు చేరిన పిదప హైదరు వారినందఱిని కలయంగనుంగొని యెన్వరి కిష్టమయినది వారెత్తుకొనవచ్చునని వారితో నుడి వెను. అంత కొందఱు మిఠాయియు మఱికొందఱు పండ్లును ఆటవస్తు వులును ఈప్రకార మ నేకుల సేక పదార్థములను స్వీకరించిరి. కాని యొక్క కుఱ్ఱఁడు మాత్రము ఒక్కమూల నిడఁబడి మెఱుంగులీనుచుండిన పిడిక త్తి నొక చేతను నిమ్మపండు ఒక దానిని మఱియొక చేతను దీసికొనెను. దానింజూచి హైదరు " అల్ల డె. ఆబాలుఁడె రాజు. అతనికి మొదటిపని దేశ సంరక్ష ణము. రెండవది. సస్యాభివృద్ధి.అతనినిట తెండు. నను గౌగ లించు కొననిండు” అని యాతనిని ప్రశంసించి యతనికిఁ బట్టా భిషేక మహోత్సవము జరిగించెను.

హైదరు ప్రభుత్వము.

ఇట్లు రాజును నియమించినను సర్వాధికారము హైదరు దేయయియుండెను. ఆంగ్లేయ చరిత్రకారుల వలన నితఁడు లోకమున జనియించిన మహా రాజ్య నిర్మాతలలో ఒక్కడుగఁ బరిగణింపఁబడు చున్నాఁడు. ఇతని కాలమున మైసూరు సం స్థానము ఉత్తరమున కృష్ణవఱకును దక్షిణమున దిండిగల్లువ