పుట:Delhi-Darbaru.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

334

మైసూరు రాజ్యము.


కును వ్యాపించి యుండెను. రాజ్యమును నలువైపుల: బెం చుట సులభ సాధ్యముగాదు. అందున హైదరుకాలమున దక్షిణ హిందూస్థానము నందు నైజామును, మహారాష్ట్రులును, ఆం గ్లేయులును బలవంతులయియుండిరి. వీరందజతోడను పో రాత నికిఁదప్పి నదిగాదు.

మొదట మొదట హైదరునకును ఆంగ్లేయులకును స్నే హమే కాననచ్చుచున్నది. 1763 వ సంవత్సరమున హైదరు బెడ్నూరును సాధించి అది వఱకు నామకార్థముండిన రాజును అతని తల్లిని చెఱపాలయు నుంచిన పిదప ఆంగ్లేయుల కొక కొన్ని నర్తకపు హక్కులను ఇచ్చినట్లు నిదర్శనములున్నవి. 1766 లోఁ గూడ హైదరు ఆంగ్లేయులకు మళయాళములో వర్తక విషయమునఁ గొన్ని సదుపాయము లేర్పఱుచుకొనుట కును అనుమతి నిచ్చియున్నాఁడు. కాని అతఁడు సమయమున కందఱతో స్నేహము చేయుచు ఆది కానప్పుడు శత్రుత్వము వహించుచున్నట్లు నిర్ధారణ చేయవలసియున్నది. 'మొత్తము మీఁద నతఁడు ఫ్రెంచి వారితోడనే యెక్కుడు మైత్రిగలిగి. యుండెను. అందుచే నతఁడాం గ్లేయులతో నిరంతరము పోరా' డుచునే యుండవలసి వచ్చెను. మనకుఁ దెలిసినవఱకు నతని కిని ఆంగ్లేయులకును యుద్ధము ప్రాప్త మగుటకు మొదటి కార ణము నైజూము హైదరుపయి కెత్తిపోవు తరుణమున నాం- గ్లేయులు నైజామునకు సాయపడుటయే. నాఁటినుండియే