పుట:Delhi-Darbaru.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిక్కదేవరాజు.

325


నాశ్రయిం చెను. అతఁ డీతనినిసాకు చేసికొని దక్షిణముపయిదాడి వెడలి నచ్చెను. కాని మైసూరు సైన్యము లతనినిఁ దిరుగఁ గొట్టి సక్కరపట్నము, హాసను మున్నగుఁ బ్రదేశములను స్వాధీ నము చేసికొనెను. ఇవి యిట్లుండమధుర నాయకుఁడు మైసూరు పైకిదండెత్తవచ్చెను. అతఁడు దొడ్డ దేవ రాయనిచేఁ బరాజితుఁ డగుట యేగాక కొసరునకు ఈ రోడ్డు, ధారాపురములను మైసూ రునకప్పగింపవలసిన వాఁడాయెను. తిరుచినాపల్లియు నితర ముఖ్య పట్టణములును దొడ్డ దేవరాయని సైన్యములకు వలసి నంతధనమును ఈనవలసివచ్చెను. ఇల్లీతని కాలమున మైసూరు రాజ్యమున తూర్పు పడమరల సక్కెరపట్నము మొదలు సేలము వఱకును ఉత్తరదక్షిణముల చిక్కనాయకునిహళ్లి మొదలు ధారాపురము (కోయంబుత్తూరుజిల్లా) వఱకును వ్యాపించి యుండెను.

చిక్క దేవరాజు.

దొడ్డ దేవ రాజునకుఁ బిమ్మట రాజ్యమునకు వచ్చిన వాడు చిక్కదేవ రాజు, దొడ్డ దేవరాజునకు సింహాసన మిచ్చు నప్పు డితఁడును నద్దానికర్హుడుగ నుండెను. కాని అప్పు డీతని హక్కు విచారింపఁ బడదయ్యెను. దొడ్డ దేవ రాజు ప్రభువగుట తోడ నే ఇతఁడును ఈతనితండ్రియు హంగళములో చెఱయం దుంచఁబడిరి. ఇతనికి బాల్యమున ఎళందూరు నందుండ విశాలాక్ష పండితుఁ డను జై నుని స్నేహముగలిగి యుం