పుట:Delhi-Darbaru.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

324

మైసూరు రాజ్యము.


నితఁడు దన సైన్యములతో బయలు దేరి దక్షిణమున మధుర నాయకునుండి సత్యమంగళముమున్నగు ప్రదేశములను, పశ్చిమ మున చెంగల్వులపరాజితులఁ జేసి ప్రియపట్న మును అర్కల గూడెమును,ఉత్తరమున(ఇప్పటి సేలములోని) హోసూరును, దీసి కొని మాగిదిక ధ్యక్షుఁడగు కెంపెగౌడుని ఎలహంక కడనోడించి యాతనిచేఁ గప్పము . కట్టించుకొనెను. ఇట్లు రాజ్యమును వి స్త రింపఁ జేసి శ్రీరంగపట్న ప్రాకార కుడ్యములను బలపఱచి తన పేరిట నాణ్యములు ముద్రింపించెను. కంఠీరవ హొన్నుల నియు పణములనియు ఆనాణ్యములె మైనూరు సీమయందు హైదరాలీకాలమువఱకుఁ జెల్లుచుండెను. ఈకంఠీరన నరిసిం హుఁడు గ్రామాధికారుల పొగరణచుట కై వారి పై పన్ను లధి కముగ వేయుచుండెను. ఇతఁడు మహాదానపరుఁడు. అనేక దేవాలయములకు ఈతఁడు పెట్టిన మాన్యము లె ముఖ్యాధార ములు. మైసూరు రాజధానిలో నేటికిని జరుగుచుండు దసరా యుత్సవము లీతనివలన నుపక్రమింపఁబడిన వే.

దొడ్డ దేవరాజు,

కంఠీరవ నరసింహుఁడు సంతానము లేని వాఁడయినం దున రాణియు సేనానియుఁ జేరి బోళ శ్యామరాజు మనుమని దొడ్డ దేవరాయని రాజుఁ జేసిరి. ఈతని కాలమున విజయనగర సామ్రాజ్యపు రాజులలో గడపటివాఁడగు శ్రీరంగ రాయలు బెడ్నూరునందు సర్వాధికారము నడుపు చుండిన శివప్ప నాయకు