పుట:Delhi-Darbaru.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

326

మైసూరు రాజ్యము.


డెను.అతఁడును చిక్కదేవరాయల నెప్పుడును విడిచి యుండ లేదు. హంగళమునకుఁ గూడ వెంబడి యరిగియుండెను. కావున చిక్క దేవరాజు రాజగుటతోడ నె విశాలాక్ష పండితుఁడు మంత్రియయ్యెను. మతమును బట్టి అతనియెడఁ గొంతయ సంతుష్టి దేశమునఁ బుట్టెను. కాని రాజు యొక్కయు మంత్రి యొక్కయు సామర్థ్యమువలన నట్టి యసంతుష్టి అణఁగి పోయెను. ఈచిక్క దేవరాజు మైసూరు రాజులలోని మహా యశోవంతులలో నొక్కఁడు. ఇతఁడు రాజ్యమారంభించిన కొలఁది కాలములో దేశమంతటను తపాలావసతులను నిర్మించెను. తపాలాధి కారు లే గూఢచారులుగ నుపచరించుచుండిరి. వారాయా జిల్లాల లోని ఆంతర్యవి శేషములనుగనిపట్టి వ్రాసిపంపునట్లు కట్టుదిట్ట ములు సేయఁబడెను. 1675 మొదలు 1678 వఱకును చిక్క దేవరాజు రాష్ట్రమును బెంచుటయం దుద్యుక్తుఁడయి మద్గిరి భాగములను సంపాదిం చెను. ఆటు తరువాత పన్ను లలో మార్పులనేకములు చేయఁదొడంగెను. ఇతఁడు నేలపన్ను ఎక్కుడు చేయఁగూడదను నిర్ణయము చేసికొని ద్రవ్య మార్జి చవ లెనను అభిలాష మాత్రము విడువక చిల్లరపన్నులు విశే షము ప్రజల పై మోప మొదలిడెను. దానినలన నెక్కుడ సంతుష్టి పుట్టనారంభిం చెను. అది జంగమాచార్యులు ప్రేరే పణవలన నెక్కువయ్యెను. రైతులు భూములు దున్నుట మాని వేసి రాజీనామా లిల్చి దేశ మువిడిచి లేచిపోవ సన్నద్ధులయిరి.