పుట:Delhi-Darbaru.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాష్ట్ర కూ టు లు.

305


వారు పల్లవులతోఁ బోరాటము పెట్టుకొని దూర దేశమగు కాంచీపురము వంక నే దృష్టు లేకాగ్రచిత్తులయి సారించుచు వచ్చినందున వీరికిఁ బూర్వవిరోధులయి వీరివలన నోడింపఁబడి వీరికి లోబడి వీరిపొరుగున నివసించుచుండిన రాష్ట్రకూటులు సమయము వేచియుండి వీరిని కబళించి వేసిరి. కావున ఎనిమిదవ శతాబ్దము మధ్యమునకు రాష్ట్రకూటులు బలవంతులయి రెండు శతాబ్దముల కాలము చాళుక్యుల పేరును బై కి రాకుండఁ జేసిరి.

రాష్ట్రకూటులు.

ఇట్లు చాళుక్యులను అణగదొక్కి, శాసనములను బట్టి చూడ, మైసూరునందు మిక్కిలి బలవంతులయి రాజ్య మేలిన యీ రాష్ట్రకూటు లెవరు? వీరి చరిత్రయెక్టది? అనెడియంశములు మన మిట విచారింప వలసియున్నది. వీటికి రాజపుత్ర రాఠర్ లతో సంబంధముండిన నుండవచ్చననియు రెడ్లు అనువారు వీరి సంతతివారుగ నెన్నఁబడు చున్నారనియు చరిత్రకారులు వ్రాయుచున్నారు. వీరుదక్ష్మిణ హిందూస్థానమున బహుకాల ముగనుండి యుండవచ్చును. కాని వీరి చరిత్రయందు, మనకుఁ దెలిసిన వరకు, మొదటి రాజు చాళుక్యులచే నోడింప బడిన కృష్ణుఁడు. ఈ వంశములోని మఱియొక కృష్ణుఁడు మొదటి కృష్ణుఁ డను వాఁడు తన మేనల్లునితోఁ జేరి చాళుక్యులను చెండాడి 754వ సంవత్సర ప్రాంతమున రాష్ట్రకూట రాజ్యమును స్థాపిం ,