పుట:Delhi-Darbaru.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మల్లారి రా పు.

261


లేదనుట గాదు. ఈతని రాజ్య కాలమున ఒక రైలుదారి శాఖ వేయఁబడెను. రెవిన్యూ సర్వే ప్రారంభింపఁ బడెను. . 1857వ సంవత్సరపు గొప్ప తిరుగుబాటు ఈతని దినముల లోనె జరిగెను. అప్పుడు చుట్టు ముట్టుంగల దేశమంతయును అల్లకల్లోలమున మునుఁగుచుండ నీతఁడు మాత్ర మాంగ్లేయుల యందుఁ జలించని భక్తికలవాఁడయి ప్రవర్తించెను. తిరుగుబాట ణఁగి పోయిన తరువాత నాంగ్లేయ ప్రభుత్వమువా రీతని నడతకు సంతసించి గుజరాతు క్రమవిరహితాశ్విక ' సైన్యమునకయి గాయిక వాడు చెల్లించుచుండిన మూఁడులక్షల రూపాయిలను మన్నించి వేసి, జి. సి. ఐ. ఇ. బిరుదము మెసంగి దత్తు చేసి కొనుట కధికారముగూడనిచ్చిది. ఇతఁడు పదునాలుగు సంవత్సర ములు రాజ్యభారము నిర్వహించి 1870 లో హటాత్తుగ మరణ మందెను. కావువ నీతని తమ్ముఁడు గాయిక వాడుగఁ బ్రకటింపఁ బడెను.

మలారి రావు. (1870-1875)

ఇతని పూర్వచరిత్రగాని గాయిక వాడు పదమునకు వచ్చిన తరువాతి చరిత్రగాని ఈతనియందెట్టి సద్గుణములను బయలు పఱచుట లేదు. 1857వ సంవత్సరమున నాంగ్లేయ ప్రభుత్వమును బరోడా సంస్థానమున నశింపఁ జేయ వలయు నను నుద్దేశముతోఁ బన్నఁబడిన యొక కుట్రయం దీతఁడు ముఖ్యాంగముగ నుండెను. అప్పుడు రెసిడెంటుగా నుండిన