పుట:Delhi-Darbaru.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స. యా జి రా వు "II.

255


నేమించెను. అతఁడు గుజరాతునందును బరోడాయందును ఆంగ్లేయుల లాభనష్టములఁ గనిపట్టవలసిన వాఁడయ్యెను. అతఁడు బరోడా వదలుట తోడనే ఆంగ్లేయుల ఫూచీ పై గాయి కవాడునకు అప్పులిచ్చిన సాహు కారులును దమకుఁ దగిన గౌరవముగాని సంరక్షణగాని సయాజి రావు వద్ద జరుగదని గాఁబోలు బరోడాను వదలిరి.

1831 వ సంవత్సరమున మాకము మారిపోయెను. బొంబాయి గవర్నరుగ లార్డు క్లేరు ఏ తెం చెను. అతఁడు మిక్కిలి మెత్తని గుం డెగలవాఁడు. కావున సయజిరావు మహారాజు నెడ సామవాక్యములు నెపం బ్రారంభించి మాకము కాఠిన్య మువలన నడచిన కార్యముల నన్నిటిని ఒక్కటొక్కటిగ రద్దు పఱచెను. ఆ గ్లేయు లాధీనము చేసికొని పరిపాలించుచుండిన మండలములు గాయిక వాడునకు మరల్చఁబడెను. -బరోడా యందు రద్దయిపోయి యుండిన రెసిడెంటు పదము పునరుజ్జీవి తము చేయంబడెను. సయాజి రావునకును సాహు కారులకును బరస్పర విశ్వాసము జనించుటం జేసి వారు బరోడాకు వచ్చి చేరి యెప్పటిన లెఁ దమ" 'తమ వృత్తులనుండ నిర్ణయించుకొనిరి సయాజిరావు తన స్వంత ద్రవ్యము నుండి ఇరువదియైదు లక్షలు కర్చు పెట్టి సాహుకారులఁ ధనియించెను. గాయిక వాడు, సైన్య ములకు సక్రమముగ జీతమిచ్చుటకు జామీనుగఁ, బదిలక్షల రూపాయిలు బొంబాయి ప్రభుత్వము వారి బొక్క సమున ధరా