పుట:Delhi-Darbaru.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

254

బరోడారాష్ట్రము


కొన్ని జిల్లాలను తనయధీనము చేసికొని తన ప్రభుత్వము వారు పూచీపడిన యప్పులు దీరువఱకును ఆ సంస్థానము వారియధీన మున నే యుండునని తెలియపఱచెను. ఇతఁడు ఏడు సంవత్స రముల కౌలులను రద్దు చేసి, దానివలన గుత్తగాండ్ర కయిన' నష్టము గాయిక వాడు. అచ్చుకోనలసినదని యుత్తరవు చేసెను. సయాజి రావుచే దివాను పదమునుండి తొలఁగింపఁబడి దేశద్రో హియని యాతనిచే నెన్న బడుచుండిన మంత్రిపక్షము వహించి ఈగవర్నరు అతనికి హక్కులను స్థాపించి పెట్టెను. ఇంతటితో నిలువక 1880 వ సంవత్సరమున స్వయముగ బరోడాకుఁబోయి గాయికవాడు మహా రాజుగారితో సంభాషించుట ముగించు కొని గాయిక వాడు సైన్యములు 3000 తగిన స్థితియందు లేవని నిర్ణయించి రెసిడెంటున కవ్వానిని సంస్కరించుటకు నుత్తరు విచ్చి వానికగు. కర్చునకుఁగాను 10 లక్షల ఆదాయము నీను మఱికొన్ని మండలములను గాయికవాడు సంస్థానమునుండి స్వాధీనము చేసికొనెను. కాని - ఈ కార్యమును ఇంగ్లాండు నం దలి డైరక్టరులు ఖండించినందున నిది నిలచినదిగాదు. దీనికిందరువాత బరోడాయందు రెసిడెంటుండుటవలనను ఆతఁడు అంతః పరిపాలనా విషయమున జోక్యము వుచ్చుకొనుట వలనను లేనిపోని భేదములు పుట్టుచున్న వని దలంచి మాకము బరోడాయందు రెసిడెంటు పదమును దుడిచివైచి ఆయధికార ముననుండిన వానిని అహమ్మదాబాదు నందు రాజకీయ ప్రతినిధిగ