పుట:Delhi-Darbaru.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స యా జిరా వు II.

253


రెసిడెంటు చేసిన బోధలన్ని టికిని సయాజిరావు పెడచెవిఁ బెట్టు టవలన రాను రాను రాజ్య వ్యవస్థ బొత్తుగఁ 'జెడిపోవుచుండెను.. కాని కొంత చర్చ జరిగిన తరువాత నొక కొన్ని మండలము లను ఘరానా మనుష్యులకు ఏడు సంవత్సరములకు మునిగుత్త కిచ్చి నై చి ఆంగ్లేయులు ' పూచీపడిన యప్పులు దీర్చున ట్లేర్ప. డెను. దీనికంగీకారము సయాజిరావిచ్చెను గాని ఏకారణము ననో ఈ ఏర్పాటునకుఁ గారకుఁడయిన మంత్రి నాతఁడు పని నుండి తొలగించెను. తరువాత సయాజీ రావు ఈ ఏడు సంవత్సర ముల కౌలుల విషయములోఁ గొన్ని' యక్రముల నడిపెను: ఈ లోపుగ ఎల్ఫిన్ స్టన్ బొంబాయి గవర్నరు పని చాలించు కోని స్వదేశమునకుఁ జనియుం డెను. అతని స్థానమును సర్ జాన్ మాకము అను నతఁ డధిష్ఠించె.

ఎల్ఫిన్ స్టన్ గాయిక వాడుతో బహు సామవాక్యములు పలికి మృదు మార్గముల నాతని నడవడిని సంస్కరింపఁ బ్రయత్నిం చువాఁడు. “మాకము' అట్టివాఁడు గాక కఠినుఁడయి కన్పట్టె. 1827న సంవత్సరము నవంబరు మాసములో సయాజి రావు తన స్వంత ద్రవ్యమునుండి యిచ్చి ఆంగ్లేయులు పూచీపడినయప్పునం తయును వెంట నేతీర్చి వేయ నుపక్రమించినను అది యేమిచిత్రమో మాకము అద్దాని కియ్యకొనఁడయ్యెను. అందుమీఁద సయాజి రావునకును ఆంగ్లేయ ప్రభుత్వము వారికిని విభేదములు హెచ్చ మొదలిడెను. 1828 లో మాకము బరోడా రాజ్యము లోని