పుట:Delhi-Darbaru.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

252

బరోడారాష్ట్రము



ఆనందరావు మృతుఁడయ్యెను. నాఁడే సయాజిరావు (ద్వితీయ) గాయిక వాడు పట్టమునకు బ్రకటింపబడియెను.

'సయాజిరావు II (1818-1847).

బొంబాయి గనర్నరుగారు దర్శన మిచ్చునప్పటికి శీతా రాము మఱల బరోడా వచ్చి చేరి యుండెను. అతఁడు దివాను పదమున కాశించెనుగాని ఎల్ఫిన్ స్టన్ అంగీకరింపనందున మఱి యిద్దఱు దివాను 'లేర్పఱుపఁబడిరి. వారియందును నమ్మకము లేమిం జేసి సయాజి మీర్ -సక్ ఫరజ్ - ఆలీని వారింగ ని పెట్ట నియ మించెను. అది వఱకు బరోడా సంస్థానపు రాజ్య కార్యములను దీర్చుచుండిన కమీషను రద్దు చేయఁబడెను. సయాజికి అంతః పరిపాలనా విషయముల సంపూర్ణ స్వాతంత్ర్య మియ్యఁబడెను. 'అతఁడు ధనమునందుఁ బేరాసగలవాఁడయి స్వంత ధనము వేరు గను సంస్థానపు ద్రవ్యము వేరుగను జూచుకొన ప్రారంభించెను. రాజు ఇట్టి లో భియగుటవలన పన్ను వసూలు చేయువారును ఉద్యోగముల, నాశించు వారును . ' నజరానా' ల పేరిట గొప్ప గొప్ప లంచము లతనికమర్చ మొదలిడిరి. ఇట్టి పరిపాలనవలన నెట్టి నష్టములు గలుగుటయు విస్తరించి వ్రాయుటయే పని లేదు. రాజుగారి స్వంతధనాగారము' నిండుచు వచ్చెను. అనవ సరనుగు హెదాలును నౌకరీలును రాష్ట్రమునఁ బ్రబలఁ జొచ్చెను. దన్మూలమున నదివఱికె యప్పుల సంద్రమున మునిఁగి తేలుచుండిన సంస్థానము ఎక్కు-డార్థిక దుర నస్థలపాలయ్యెను.