పుట:Delhi-Darbaru.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయాజారావు I.

225


డునుగలఁడు. ఈతఁడు మహా సమర్థుఁడు. తండ్రి చనిపోయిన తోడనే ఇతఁడు తమ యన్నలలో నెల్ల పెద్దయయి వెజ్జియగు సాయాజి పరమునఁ బని సేయఁజొచ్చెను.

ఇట్లు ద్వితీయ పుత్రుఁడగు గోవిందరావునకును బ్రథమ పుత్రుని మిష పెట్టుకొని ప్రయత్నములు సలుపు నాఱవపుత్రుఁ డగు ఫ తేసింగునకును గాయిక వాడు పదమునకయి వివాదములు ప్రారంభమయ్యెను. పీష్వాకింతియ చాలునుగదా! తనకుఁ బ్రతి స్పర్థిగఁ గార్యములకుఁ బూను చుండిన గాయికవాడు కుటుంబము- నందు కలహములు వచ్చుటయు నవ్వానిని దీర్చుటకుఁ దా నేర్ప, డుటయుఁ దనకు శుభ సూచక ములుగ గ్రహించి గోవిందరావు ఫతేసింగుల వివాదములను బెంచుటకుఁ దోడ్ప డెను. గోవింద రావు దన నగరముననే యుండుటవలన నతనినుండి గొప్ప నజరు గైకొని దామాజివలనఁ జేసికొనఁ బడిన యెడంబడిక కతని సమ్మతిందీసికొని యాతనిసి గాయిక వాడు పదమునకు నేమించి పంపెను. ఈలోపుగ ఫతేసింగు సయాజీరావు పరమున బరోడా నగరమును స్వాధీనము చేసికొని యుండెను.

సయాజారావు I. (1771.1778)

1771 వ సంవత్సరమున నితఁడు పునహాకుఁ దరలిపోయి అచ్చట పలుకుఁబడి సంపాదించికొని గోవిందరావుకంటె నెక్కు డుగ వాగ్దానములు చేసి పీష్వాగా రదివజకు నిర్ణయించి యుండిన ఏర్పాటులను రద్దుపఱచు నట్లొనర్చి సయజిరావు సేనాఖాన్ బేలు