పుట:Delhi-Darbaru.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దయామయత్వము.

203


వత్సరము నియ్యవలయు పదునైదులక్షలు . పోఁగా మిగత 10 - లక్షలు -నైజామున కిచ్చునట్లును ఈయప్పులు " దీరిపోయిన తరువాత సంవత్సరమునకు సంధి ప్రకారము 25 లక్ష లిచ్చునట్లును ఒడంబడిక చేసికొనఁ బడెను. బీరారుమండలమును పరిపాల నావసరముల కొఱకు ఆంగ్లేయ మండలములతోఁ జేర్చుకొనుట కాంగ్లేయ ప్రభుత్వము వారికి స్వాతంత్ర్య మీయఁబడెను. నైజాము సైన్యమును దగ్గించు కొనుటకుగాని మార్చుకొనుటకు గాని భరత వర్షపు సైన్యములలోఁ జేర్చుకొనుటకు గాని వారికి హక్కుగలి గెను. నైజాము స్వసంరకుణకుగాని ఆతని సంస్థానములోని యల్లరుల నణఁచుటకు గాని సైన్యముల ననుపుటకుమాత్రము వారు త్తర వాదులుగ నేర్పడిరి. నైజాము దన యొద్దనుండు చిల్లర సైన్యములను 12, 000ల వఱకును దగ్గింపనియ్య కోనెను. ఆంగ్లేయ . ప్రభుత్వమువారు నైజాముగారి సంస్థానమున నుంప నెంచిన తమ సైన్యమును తదనుగుణముగఁ దగ్గింతుమనిరి . బీరారుపై నైజామునకు గల ప్రభుత్వమును సూచించుటకు ప్రతి సంవత్సరమును అతని. జన్మ దినోత్సవమున బీరారు మండలపు రాజధానిలో ఆంగ్లేయుల పతాకముతో నతని పతాకమును గూడ ఎక్కించుట నిర్ణయింపఁబడెను.

దయామయత్వము.

1908వ వంవత్సరము సెప్టెంబరు 28వ తేది. ఆదివారము నాఁడు మూసీనది వరదలు ప్రచండమై అకస్మాత్తుగఁగన్పట్టి హైద