పుట:Delhi-Darbaru.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

హైదరాబాదు సంస్థానము.


రాబాదు పట్టణము నందు విశేష భాగమునకుఁ బ్రళయముగఁ బరిణమించినదిప్పటికినిఁ దలఁచుకొనిన హృదయమునందు సంతా పముపుట్టక మానదు. ఆతరుణమున మీర్ మహబూబ్ ఖాను నాలుగు దివసములు నిద్రాహారములు మాని కన్నీళులు విడుచుచుఁ దన ప్రజకుఁ దటస్థించిన మహద్విపత్తును మాన్పుటకయి సర్వ విధములను జేసిన ప్రయత్నములు జ్ఞప్తికివచ్చిన నాతని దాతృ త్వమును కరుణాళుత్వమును స్ఫుటముగ మనోగోచరములగుచు న్నవి. దురదృష్టుల కష్టములఁ బాపుటకతఁడు రాష్ట్రపుబొక్కన మునుండి యిచ్చిన ద్రవ్యముతో సంతుష్టిఁ జెందక తన స్వంతధన మునుండి 4 1/2 లక్షల రూప్యములను ధారాళముగ నొసంగి కమీ టీల నేర్పఱచి భోజన పదార్థములును, స్త్రీలకు బాలురకు బాలి కలకు ఎల్లరకును దగినవస్త్రములును, దుప్పటులు గొంగళ్లు చొక్కాలు మున్నగు చలినాపు వ స్త్రవి శేషములును, ప్రతి గృహమునకుఁ జేర్పిం చెననిన మన మీరు మహాబూబ్ యొక్క ఉదార హృదయమును వర్ణించిన వారమగుదుము.

సూర్ మహబూబ్ ఆలీఖానుఁడు దన ప్రజలయెడఁజూపిన దొక్క యనురాగము మాత్రమె కాదు. వారియం దతనికి సం పూర్ణమగు నమ్మకముం డెడిది. ఈ విషయమును సిద్ధాంతీకరించు టకు నతఁడు మింటో ప్రభువునకు వ్రాసినయుత్తరమె చాలి యున్నది. గవర్నరు జనరలుగారు రాజద్రోహము విషయమై జాగ్రత్తగ నుండవలసినదని వ్రాయ దానికితఁడు దన రాజ్యమున