పుట:Delhi-Darbaru.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉస్మాన్ అలీఖాన్ ,

205


నట్టి నేరములుండుటకు వీలు లేదనియుఁ బ్రజలు మత భేదములు లేక పరిపాలింపఁబడుట చే సంపూర్ణముగ సంతుష్టులయి యున్నా రనియు వ్రాసి యతని కాశ్చర్యమును బుట్టించెను.

మిరుమహబూబ్ నిర్యాణము.

ఇట్లు ఇరునదియేడు సంవత్సరములు ప్రజారంజక ముగ రాజ్యము చేసి 1911 వ సంవత్సరము ఆగస్టు నెల 30 వ తేదిన 45 సంవత్సరముల వయసున హిజ్ హైనెస్ ఆసఫ్ జా ముజఫరుల్ ముమాలికు నైజాముల్ ముల్కు నైజా ముదౌలా నవాబు మీరుసర్ మహబూబు అలీఖాన్ బహ దూరు ఫత్తేజంగు జి. సి. ఎస్. ఐ. జి సి. బి. గారు అకసా తుగ మరణమం దెను. దయామయుఁ డై దీర్ఘ కోపమూను వాఁడు గాక ప్రజలయం దనురాగముగల్గి ఆడంబర మొక్కింత యేని దగ్గర రానీక జనులయందు సంపూర్ణ మగు నమ్మిక కలవాఁడై రాజ్యభారమును వహించి రాజ్య కార్యముల నిర్వహించిన ఈమహానీయు నెవ్వరు గౌరవింపరు? ఈలోకమాన్యుని మర ణమున కెవ్వరు వగవకుందురు ?

ఉస్మాన్ అలీఖాన్.

అతఁడు పరలోక ప్రాప్తిఁ జెందినతోడనే అతని కుమాఁ రుడగు ఉస్మాన్ అలీ ఖానుఁడు నైజాము పదమునకుఁ బ్రక టిం పబడెను. ఇతఁడు గద్దియ నెక్కుతరి “నాతండ్రిగారి వలెనే నేనును ప్రజకును దేశమునకును నావలన నైనంత మేలును