పుట:Delhi-Darbaru.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఋణ ప్రదాతల యొ త్తిడి

165

.

యెడల గవర్నరుజనరలు ఆంగ్లేయవర్తక సంఘము వారికి న్యా యమునడపుటకు వలసిన కార్యములకుఁ బూనవలసిన వార గుదురనియు రెసి డెంటు నైజామునకుఁ దెలియఁ జేసెను. 1850 న సంవత్సరము ఫిబ్రవరి మాసము వరకును కాలము గడచి పోయెను. అప్పటికిని నైజాము రాజ్యాంగ వ్యవహారములయందు తగిననూర్పులు గనుపించ లేదు. కావున బహుకాలముగ నైజా మునడవడిని గని పెట్టియుండిన రెసిడెంటు ఫ్రేజరు బీరారునం దలి స్థితిగతులను గుఱించి వ్రాయుచు “ఏమంత్రి ఏర్పఱుప బడినను అతఁడు రాజ్యాంగ కార్యములను నెరవేర్చుటకు సంపూర్ణ స్వాతంత్యము గలవాడుగ నొనర్పఁబడ వలె”నని నైజామునకుఁ దెలియఁ జేయుట ముఖ్యతమమనియెను. ఈవిష యమున జనరల్ ప్లేజరు నైజాముతోఁ గలిసి మాట్లాడుటకు నుత్తరువుగొనెను. తాను సింహాసనారూఢుఁడయి నపుడు మంత్రుల నేరుకొను స్వాతంత్యము తనకు గలదని అప్పటి రెసిడెంటు నుడివి యుండుటను నైజామా సందర్భమున జ్ఞాపక , పరిచెను. దీనికి జనరల్ ఫ్రేజర్ , వల్లెయని అప్పుడు పేష్కా రుగానుండి దివానుపనులను గూడ అసమర్ధతతోఁ జూచుకొను చుండిన రాజారాం బక్షి గారిని దీసి వేసినను దీసివేయుననియు లేకున్న వేరొక్కరుని దివానుపనికిమాత్రము "నేమించుననియుఁ దలంచి తన సంభాషణమును ముగిం చెనఁట.