పుట:Delhi-Darbaru.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

హైదరాబాదు సంస్థానము.


1851 వ సంవత్సరము ప్రారంభమాయెను. నైజామున కాంగ్లేయుల ఋణమును దీర్ప నియమితమయి యుండిన గడువు మారిపోయెను. కావున రెసిడెంటు నైజామును జూచి యతనికి గవర్నరు జనరలుగారి యసంతుష్టిని తెలియఁ జేసెను. ముఖ్య మంత్రిపదవికిఁ దగువాఁడు ఏర్పడకుండుటనలన రాజ్యమరాజక ముగ నున్నదనియు నట్టియ రాజక పుస్థితికి తాముమిక్కిలి వగచు చుంటిమనియు కూడ జనరల్ ఫ్రేజర్ ముఖమున గవర్నరు జన రలుగారు తెలియఁ జేసిరి. నైజాము రాజ్యములో కొంత భాగ మునుస్వాధీనము చేసికొని పరిపాలించి దానిమూలమునఁ దమ కతఁడు బాకీపకిన ధనము రాఁబట్టు కొనవలసిన దేగాని యితర విధములఁ తీరదని రెసిడెంటు తెలియచే సెను. దానిని గవర్నరు జనరలును ఒప్పుకొనెను. కాని ఆ ఏప్రిల్ మాసమునందే గణేశ రావు దివానుగ నియమింపఁబడెను. ఇతఁడసమర్థుఁడనుట బహు స్వల్ప కాలములో నే విశదమయ్యెను. ఆ గ్లేయ ప్రభుత్వము వారికి రావలసిన పైకము ఇతని శక్తి వలన వచ్చుటకల్లయని తెల్ల మయ్యెను. అందువలన గవర్నరుజనరలుగానుండిన లార్డుడాల్ హూసీ నైజాము బాకీపడిన మొత్తము తీరుటకై అతని రాజ్య . మునఁ జేరిన బీరారును, అచ్చటినుండి పోలాపురము వఱకుం గల భూభాగమును, కృష్ణా తుంగభద్రల మధ్యప్రదేశ మగు రాయచూరు మండలమును, సర్వాధికారములతోఁ దమకు నిచ్చి వేయవలసినదని నైజామునకు వ్రాసెను. సాధ్యమయినంత