పుట:Delhi-Darbaru.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

హైద రా బా దు సంస్థాన ము.


మయి యుండెను. మహారాష్ట్రులు మరల మొగలాయీల రాష్ట్రమును గొల్ల గొట్టుచుండిరి. ఆసఫ్ జాకు వారి నణ చుటకు శ క్తిచాలకపోయినను ఎక్కుడు బుద్ధి కౌశల్యము గల వాఁడు గావున మహా రాష్ట్రులలో నంతఃకలహములు పుట్టించి గొందఱను ఢిల్లీ పాదుషాహ పక్షము .పూనునట్లొన ర్చెను. ఈపగిది భేదోపాయముచే నొక్క సంనత్సరములోపలఁ దన రాజ్యమును మహారాష్ట్రుల బారినుండి తప్పించినదే గాక యితఁడు కర్నాటకము పై దండెత్తుటకుఁ గూడ సన్నద్ధుఁ డయ్యెను. కాని యీలోపల నితనిని బాదుషాహగారు ఢిల్లీకి రానలసినదని యాజ్ఞాపించిరి. కారణము ఢిల్లీలో ముఖ్యమంత్రిగ నుండిన హుసేనాలీ ఖానునకును బాదుషాహ కును సరిపడక పోయినందున హుసేనాలీని దక్షిణాపథమునకుఁ బంపి వేయవలయునను తలఁపు బాదుషాహకు బుట్టుటయె. సాహూ దెబ్బకుఁ దాళ లేక యతనితో మైత్రిచేసుకొని హుసే నాలి 1718 వ సంవత్సరమునఁ దన యజమాని మీఁదికి దండె త్తి వెడలి ఢిల్లీ చేరెను. అచ్చట జరిగిన ఘోరయుద్ధమున ఫరూకుసయ్యరుని చంపి మహమదుషాహను సింహాసన మె క్కించిరి. ఆసఫ్ జాకు దక్షిణాపథ రాజప్రతినిధిత్వము మరల దొరకుట కష్టమయ్యెను. 1720 లో నితఁడు దగిన ఏర్పాటు లెల్ల యు ముందే చేసి యుంచుకొని ఢిల్లీ వదలి హైదరాబాదు పోయి చేరెను. స్వాతంత్ర్యము ప్రకటించుటకు ఆసఫ్ జా