నైజా ము అల్ ముల్ క్.
111
చెను. కాని ఫరూకుసయ్యరు బంగాళమున నుండుటచే నతఁ
డీతనికి దొరక లేదు. కావున వీరిరువురకును యుద్ధము దప్పినది
గాదు. "జహందరుపాహ యుద్ధమున నిహతుఁడయ్యెను. . అతని
మిత్రుఁడును, బహదూరుషాహ కాలమున హైదరాబాదునందు
రాజప్రతినిధిగ రాజ్య మేలినవాఁడును నైస జుల్ ఫికర్ ఖానుఁడు-
గూడ మడ సెను. ఫరూకుసయ్యరు సింహాసనము నధిష్ఠించుట
తోడనే సమయము వేచియుండి విజయమునందిన పక్షమును
చేరిన వాఁడగుటచే చిన్ కిలీచ్ ఖానుఁడు ఆసఫ్జా నై జూము-అల్-
ముల్క్ అనుబిరుదుతో దక్షిణాపథమునకు "" రాజప్రతినిధి
యయ్యెను.
నైజాముఅల్ ముల్క్.
ఇతఁడే ప్రస్తుతపు హైదరాబాదు సంస్థానమునకు "స్తాపకుఁడు. ఇతఁ డెట్లు స్వతంత్రుఁడయినదియు మనము దెలిసి కొన వలసియున్నది. ఫరూకు సయ్యరు వలనఁ బ్రతినిధిగ నేమిం పఁబడి యితఁడు హైదరాబాదుకు వచ్చి చేరెను. . అచ్చట యితఁడు గాంచిన రాజ్యవ్యవస్థ యెట్టిది? బహదూరుషాహ కాలమున దక్షిణాపథమునఁ బ్రతినిధిగ నుండిన దావూదుఖా నుఁడు సాంభాజికుమారుఁ డయిన సాహూతో సంథి చేసి, కొని మహారాష్ట్రుల పోరునుండి 'మహమ్మదీయ రాజ్యమును దప్పించి యుండెను. కాని దావూదుఖాను ప్రతినిధి పదము నుండి వదలిపోయిన తరువాత ' నాప్రదేశమంతయు " నరాజక: