పుట:Delhi-Darbaru.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

హైద రా' బా దు సంస్థాన ము

.



అతఁడు" బీరారు "ఎలిచ్ పురముల కధిపతి. తన యజమాని కుమారులు గద్దెకయి పడు వివాదములలో నితఁడే పక్షమును' నవలంబింపఁ డయ్యెను. ఇతని కుమారుఁడు చిన్ కిలీచ్ ఖాన్ మాత్రము అజీమునకు సాయపడనియ్యకొని, యాతనితో, గొంత కాలము గడ పెను. 'కాని యతని నడ వడి సరిపడనందున ననేకులగు నితర నాయకులతోఁ గూడ చిన్ కిలీచ్ ఖాన్ . అతనిని వదలి సంగతుల గమనించుచు మిన్న కుండెను. ఔరంగ జేబు పెద్ద కొమారుఁడగు బహదూరుషా తన తమ్ము డగు అజీము నోడించి గద్దియ నెక్కెను. అప్పుడతఁడు చిన్ కిలీచ్ ఖానుని అయోధ్యకు సు బేదారుగను, లక్నోకు ఫోజు దారుగను, నియమించెను. ఆపదమందును నితఁడు బహుకాల ముండఁడయ్యెను. బహదూరుషాహ .వృధాడంబరుఁడును నసమర్థుఁడును నగుట యతని చుట్టుంగలవారు పోరాని పోక లఁ బోవుటయుఁ జూచి సహింపక యితఁడు దనయుద్యోగములను మానుకొని జరుగనున్న కార్యములను జాగరూకుఁడయి కని పట్టి యుండెను. 1712 వ సంవత్సరమున బహదూరుపాహ మృతినొందెను. 'సింహాసనమున కయి మరల పోట్లాటలు ప్రా రంభమాయెను. 'బహదూరుషాహకు జహందరుషా అనువాఁ డును, అజీముషాహకు ఫరూకుసయ్యరు అనువాఁడును, కొడుకులు.జహందరుషాహ, తండ్రి పరలోకమున కేగిన తోడ నే, వీఠమునాక్రమించుకొని రాజసంతతి వారి నంతయుఁ జంపిం