28
చాటుపద్యరత్నాకరము
"గుదియలకామినున్ననిత్రికోణముపైఁగలభాగ్యరేఖ నీ
నుదుటను లేదటం చమరనూత్నపురంధ్రులతోడఁ బల్కెడున్."
అని పద్యమును బూర్తిఁ జేసెనఁట. అందుపైఁ గోలాహలుఁ “డింక నిందుండుట మనకు మర్యాదకా” దని గిఱ్ఱున వెనుకకుఁ దిరిగి తనదారిం బోయెనఁట.
కందుకూరు రుద్రకవి
ఇతఁడు నిరంకుశోపాఖ్యానమును రచించినకవి యని యీక్రిందిపద్యములవలన నూహింపఁదగియున్నది. ఈరుద్రకవి కొకపరి తాతాచార్యు లనునొకవైష్ణవునితో వివాదము ఘటిల్లఁగా నితఁడు వ్రాసిన పద్యము:
సీ. పరదానయాచకబ్రాహ్మణులరు మీరు
పరతత్త్వమునఁ బరబ్రహ్మమేను
భూమిలో సత్పాత్రభూషణాత్ములు మీరు
కనకకుండలపరిష్కారి నేను
తరిఁ బెట్టుకున్నట్టి బిరుదవారులు మీరు
పేషిణీహనుమంతబిరుదువాఁడ
వరశంఖచక్రాంకగురువులు మీరలు
గురిమీఱఁగా జగద్గురుఁడ నేను
నీకు మాకును సాటియే లోకసృష్టి
కర్త నౌటయుఁ దెలియదా కలియుగమునఁ
దారతమ్యంబు లేదుగా, తాతయార్య!
రూఢి కెక్కిన కందుకూర్ రుద్రకవిని.