పుట:Chanpuramayanam018866mbp.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వానము

121


సీ.

లలితనిరాతంకలంకాపురీమహాదాహక్రియాసముత్సాహసమయ
మందును లవలేశ మైన నార్తి నెఱుంగ కిరవొందు భానువంశ్యేంద్రురాణి
సుస్థితి రాణించుశుభచారణోక్తిచేఁ దెలిసి హర్షమునఁ దద్దేవి కెరఁగి
ప్రతియానవిధికిఁ దత్సతినియోగముఁ గాంచి శీఘ్రంబె యారిష్టశిఖరి నెక్కి


గీ.

భూరిగంభీరభీకరాంబునిధి దాఁటి, మఱి మహేంద్రధరాధర మధివసించు
కపికులాధీశ్వరులఁ బూర్ణకాములుగను, బళిరె యొనరించె ధృతిఁ బూని పావమాని.

121


మధువనభంగము

క.

వెండియుఁ దనవృత్తాంతము, చండాంశుకులేంద్రుదూత సైన్యేశులకున్
నిండుమనంబునఁ దెలిపె న, ఖండితబహుమానపూర్వకంబుగ నంతన్.

122


క.

ఆనిలివాక్ప్రముదితకపి, సేన యహంపూర్వికఁ జని (జితశేఖరుమా
ర్గాన) న్దధిముఖకృత మవ, మానము నిరసించి చలిపె మధుపానంబున్.

123


గీ.

అపుడు మధువనభంగదృష్ట్యరుణముఖుఁడు
దధిముఖుఁడు వల్కె వాలినందనునిఁ జూచి
మొనసి మధుపానవిధిశిలీముఖము లైన
యీవలీముఖులను మాన్పు మీవె యనుచు.

124


వ.

అంత గిరిశృంగతుంగనిజాంగుం డైన యంగదుండును దధిముఖుం గనుంగొని యిట్లనియె.

125


మ.

కనుఁగొంటి న్రఘునాథవల్లభను లంకారాజధానీవనాం
గనమధ్యంబున నంచు నేఘనుఁడు మత్కర్ణామృతాభాషణం
బును జిల్కె న్మఱి వానిమాటకును దప్పుం గల్గునే కీశవా
హిని తాఁగ్రోలు యథేచ్ఛగా మధువు నెంతే యీవనాంతంబునన్.

126


గీ.

అనినయంగదోక్తి నాలించి భీతుఁ డై , దధిముఖుండు వోయి తపనసుతుని
తోడ విన్నవించె దుర్వారవనభంగ, మతఁడు రాముకెలన హర్ష మొందె.

127


ఉ.

సానుమదగ్ర మెక్కి వరుసన్ డిగి మ్రాకులఁ గౌఁగిలించుచుం
గానలఁ బండ్లు మెక్కి మఱి గంతులువైచుచుఁ గూయుచు న్మదా
నూనతఁ దోఁక పట్టుకొని యొండొరుల న్వడిదాఁటి పాటవా
[1]పీనకపీశసేన గనిపించె నదూరత నద్భుతంబుగన్.

128


ఉ.

నిద్దురలేమి శోణతరనిర్భరమై తగుకన్నుదోయిచే
నొద్దన యుండి యూర్మిప్రియుండు గనుంగొన నాంజనేయుఁడుం

  1. పిన గపిసేన నప్డు గనుపించె నదూరత మద్భుతంబుగన్-మాతృక.