15]
ఎనిమిదవ ప్రకరణము
113
బేళ్లు గలవు. ఈ నీటి బాటల కర్హమగు నావ లనేక తరములవి ఉండెడివి. సంయాత్యనావలును ప్రవహణములును సము ద్రముమీఁద ప్రయాణీకుల కుపయోగపడునవి. శంఖముక్తాగ్రాహిణనావలు పేరే ప్రకటించునట్లు సాగరమునండు ముత్తెముల నేరి తెచ్చుటకుఁ బయనమగునవి. మహానావలు మహానదులయం దుపయోగపడునవి. క్షుద్రనావలును, తెప్పలును, బుట్టలును ( హరగోలు ), ప్లనములును మున్నగు నీటిని దాఁటించు సాధనములకు లెక్క లేకుండెను.
నావలలోని యుధికారులును, సేనకులును, వారివారి కర్తవ్యములును విస్తారముగ వర్ణితములయి యున్నవి. కావున నావికాయాన మప్పుడు పూర్ణస్థితియం దుండెనని చెప్ప నొప్పును.
వ్యాపారము - చేతిపనులు.
ఇట్టిబాట లుండుటవలనఁ జంద్రగుప్తుని కాలమున వ్యాపారము అతివిస్తారముగ జరుగుచుండెను. మధుర1[1], అప రాంత2[2]. కళింగ, కాశి, వంగ, వత్స3[3], మహిష4[4] దేశములు సుందరతమమగు ప్రత్తివస్త్రములం బంపుచుండెను. ముత్యములు పారశీకము నుండియు బర్బరమునుండియు ; వాసన ద్రవ్యములు