ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మూసారు. తాను వాళ్ళకంటె గొప్పవాడు కాదు. కనుక తానూ ఓటమిని అంగీకరించి కన్నుమూస్తే బాగుంటుంది- ఇవి యేలీయా విషాద భావాలు.
పూర్వం కష్టాల్లోయిస్రాయేలు భక్తులు చాలమంది ఈలాగే భావించారు. ప్రజలు మాటవినక తనమీద ఎదురుతిరిగితే మోషే ప్రాణాలు విడువగోరాడు - నిర్గ 32,32 చూపకోల్పోయిన తోబీతు యూతనలకు తట్టుకోలేక చనిపోగోరాడు-3,6. నీనివే పట్టణం నాశం కాలేదని బాధపడి యోనా ప్రాణాలు వదలివేయగోరాడు-4,3. దుర్మార్ణులైన ప్రజలు పెట్టే బాధలు భరించలేక యిర్మీయా అసువులుబాయగోరాడు - 20,14. బాధలు ఎదురైనపుడు నేడు మనమూ ఈలాగే చేస్తాం.
కాని ప్రభువు ఆపదలు వచ్చినపుడు తన భక్తులను వదలివేయడు కదా! అతడు ప్రవక్తకు దారిజూపడానికి ఓ దేవదూతను పంపాడు. ఆ దూత ప్రవక్తకు ఆహారమూ నీళ్లూ అందించాడు. అతనిచే రెండుసార్లు భోజనం చేయించాడు. హోరేబుకు వెళ్ళమని సలహా యిచ్చాడు. ప్రవక్త ఆ ఆహారబలంతో నలభైరోజులు నడచి హోరేబు కొండను చేరుకొన్నాడు.
అది దేవుని కొండ, పుణ్యక్షేత్రం. పూర్వం మోషే ఇక్కడే యావేను దర్శించాడు. యావే మతం ఇక్కడే ప్రారంభమైంది. ఆ మోషే పిలుపునీ ఉద్యమాన్నీ ఇప్పడు ఏలీయా కొనసాగించాలి. ఆనాడు మోషేకు దయచేసిన బలాన్నీ ప్రేరణనీ ప్రభువు ఇప్పుడు ఏలీయాకుకూడ ప్రసాదిస్తాడు. హోరేబు కొండమీది యేలీయా అదే కొండమీది మోషేను జ్ఞప్తికి తెస్తాడు.
ఏలీయా రాత్రి ఆ కొండలోని ఓ గుహలో నిద్రించాడు. ప్రభువు పూర్వం మోషేనుగూడ కొండనెర్రెలో పెట్టి వుంచినట్లుగా చదువుతున్నాం - నిర్గ23,22. ప్రభువు వాణి యేలీయాను నీవిక్కడ ఏం చేస్తున్నావు? యిస్రాయేలు దేశంలో వుండవలసిన వాడివి ఇక్కడున్నావేమి అని ప్రశ్నించింది. ప్రవక్త దేవునికి మూడంశాలను గూర్చి ఫిర్యాదు చేసాడు.
1.తాను యావేను మాత్రమే కొలిస్తే యిప్రాయేలీయులు బాలుని కొల్చారు. 2. వాళ్లు యావే బలిపీఠాలను కూలద్రోసి అతని ప్రవక్తలను పట్టి చంపారు. 3. కడన ఆ ప్రజలు తన్ను కూడ చంపివేయజూస్తున్నారు. తానుకూడ పోతే యిక యావే మతాన్ని నిలబెట్టే దిక్కు వుండదు. ఇది ప్రవక్త ఆవేదన.
ప్రభువు వాణి యేలీయాను గుహనుండి కొండమీదికి ఎక్కిరమ్మంది. అతడు కొండశిఖరం ఎక్కాడు. అక్కడ పెనుగాలి, భూకంపం, అగ్నిజ్వాలలు మొదలైన భయంకర దృశ్యాలను చూచాడు. పూర్వం ఈలాంటి భీకర దృశ్యాల్లోనే హోరేబు కొండమీద దేవుడు మోషేకు దర్శనమిచ్చాడు-నిర్ణ 19,16-19. కాని యిప్పడు ఈ యద్భుత సంఘనటల్లో దేవుడు లేడు. అవి కేవలం అతని ఆగమనాన్ని సూచించేవి మాత్రమే.