జ్ఞానస్నానంద్వారా క్రీస్తు తన పత్రత్వంలో మనకూ భాగమిస్తాడు. మనలను తన సోదరులను చేసికొంటాడు. అతడు మనకు పెద్దన్న మన మందరమూ అతనికి తమ్ముళ్ళమూ చెల్లెళ్ళమూ ఔతాం. అతని ద్వారా మనం అతని తండ్రికి బిడ్డల మౌతాం. క్రీస్తు వరప్రసాదం మనలను భగవంతుని పత్రులను చేస్తుంది. అందుకే పౌలు పై వాక్యంలో తండ్రి మనలను క్రీస్తుద్వారా దత్తపుత్రులనుగా ఎన్నుకున్నాడు అని వ్రాసాడు.
కాని దివ్యగ్రంథం మనం దత్తపుత్రులమని చెప్పడం దేనికి? క్రీస్తుతోపాటు మనంకూడ పరలోక పితకు సహజపుత్రులం కామా? పితకు సహజ పుత్రుడు క్రీస్తు ఒక్కడే అందుకే దివ్యగ్రంథం అతన్ని "ఏకైక పుత్రుడు" "తొలిపుత్రుడు" అని పిలుస్తుంది. క్రీస్తు మాత్రమే సహజ పత్రుడు గావడంచేత ద్యివగ్రంథం మనలను "దత్తపత్రులు" అని పిలుస్తుంది. ఐనా క్రీస్తులాగే మనంకూడ దేవునికి నిజమైన పత్రులం. అందుకే యోహాను మొదటిజాబు “మనం దేవుని బిడ్డలమని పిలవబడుతూన్నాం. యథార్థంగా బిడ్డలంకూడ" అంటుంది. 3,1.
2. క్రీస్తు - దత్తపుత్రులు
దత్తపత్రుల్లో మూడు తరగతుల ప్రజలు గోచరిస్తారు. మొదటి తరగతికి ఆధారం అన్ని మతాలకు చెందిన ప్రజలూ తాము భగవంతుని బిడ్డలమనే చెప్పకున్నారు. భగవంతుణ్ణి “తండ్రి" అని సంబోధించారు. అతడు సృష్టికర్త ఈ నరులంతా అతడు సృజించిన ప్రాణులు. అతని నుండి ప్రాణం పొందడంవలన నరులు అతనికి దత్తపుత్రు లొలారు.
రెండవ తరగతికి చెందినవాళ్ళ యూదులు. ఈ తరగతికి ఆధారం ఒడంబడిక. ప్రభువు అబ్రహాముతో ఒడంబడిక చేసికొన్నాడు. ఈ యొడంబడికనే సీనాయివద్ద మోషే సమక్షంలో నూతీకరించాడు ప్రభువు. ఈ సీనాయి ఒడంబడిక ద్వారా యిస్రాయేలీయులు యావే ప్రజలయ్యారు. యావే ఆరాధకులయ్యారు. యావేకు పత్రులయ్యారు. యిప్రాయేలు ప్రజలు వ్యక్తిగతంగాగాదు, సాముదాయికంగా యావేకు పత్రులు. కావుననే మోషే యావే తరపున ఫరోచక్రవర్తితో మాటలాడుతూ “యిస్రాయేలు నా తొలి పుత్రుడు, అతనిని ఈజిప్టునుండి వెడలిపోనీయి" అంటాడు - నిర్గ 4, 21. ఇక్కడ "తొలిపుత్రుడు" అంటే గారాబు బిడ్డ అని భావం. యిస్రాయేలు ప్రజలంతా యావేకు బిడ్డలాంటివాళ్ళు.
మూడవ తరగతికి చెందినవాళ్ళు క్రైస్తవులు. ఈ తరగతికి ఆధారం జ్ఞానస్నానం, యూదులు సాముదాయికంగా యావే పుత్రులన్నాం. క్రైస్తవులు వ్యక్తిగతంగా గూడా యావే పుత్రులు. జ్ఞానస్నానంద్వారా ఈ పత్రత్వం మనకు లభిస్తుంది. యోహాను సువార్త "ధర్మశాస్త్రం మోషేద్వారా లభించింది. కాని వరప్రసాదమూ సత్యమూ క్రీస్తు ద్వారా లభించాయి" అని చెప్తుంది. 1,17. మోషే పూర్వవేదపు మధ్యవర్తి, అతడు యావేనుండి.