3. దత్తపుత్రులు
పూర్వాధ్యాయంలో పవిత్రీకరణ వరప్రసాదం మనలను దివ్యలను చేస్తుంది అని చెప్పాం. ఇదే వరప్రసాదం మనలను దేవునికి దత్తపుత్రులను చేస్తుంది. కావున ఈ యధ్యాయంలో దత్తపుత్రులు కావడమంటే యేమిటో చూద్దాం. ఇక్కడ మూడంశాలను పరిశీలిద్దాం.
1. దత్త పత్రులు
ఎఫెసీయుల జాబులో పౌలు, పరలోకపిత లోకారంభం నుండి మనలను క్రీస్తుద్వారా దత్తపత్రులనుగా ఎన్నుకొన్నాడు అని వ్రాసాడు - 1,5. దత్తపత్రులటే యేమిటి? క్రీస్తు ద్వారా ఎన్నుకోవడమంటే యేమిటి?
దత్తపుత్రుని లక్షణాలు రెండు. 1. మన కుటుంబానికి చెందని అన్యవ్యక్తి నొకనిని పుత్రునిగా స్వీకరిస్తాం. 2. కుటుంబపు ఆస్తిపాస్తులపై అతనికి వారసపు హక్కులభిస్తుంది. ఈ రెండు ఉపకారాలనీ అతనికి హక్కులేదు. క్రొత్త తల్లిదండ్రుల కారుణ్యం వలన ఈ రెండుపకారాలు అతనికి ఉచితంగా లభిస్తాయి.
దేవునిపట్ల మనకు చనువు వుంటుందని తెలియజేయడానికే పౌలు మనం దత్తపుత్రులమని చెప్పడు. దత్తపుత్రుడు క్రొత్త తల్లిదండ్రులను తన సొంత తల్లిదండ్రుల్లాగ భావిస్తాడు. వాళ్ల పట్ల చనువుతోమెలుగుతాడు. వాళ్ళూ అతన్ని ప్రేవున బుట్టిన బిడ్డనులాగ వాత్సల్యంతో చూస్తారు. ఈ చనువు ఈ ప్రేమ దేవునికీ, మనకీ వుండే బాంధవ్యానికి ఓ మాదిరి పోలిక.
దత్తపుత్రుడు యథార్థంగా తల్లిదండ్రుల ప్రేవున పుట్టలేదు. అతనికి భౌతిక జీవితాన్ని ఇచ్చింది వాళ్ళుగాదు. అతని పట్టుక, మనిక ఈ తల్లిదండ్రులమీద ఆధారపడి వుండవు. కాని భగవంతునిపట్ల మన పత్రత్వం ఈలాంటిదిగాదు, పరలోక పిత మనలను దత్తపుత్రులనుగా స్వీకరించినపుడే తన పితృత్వాన్ని మనమీద విస్తరింప జేస్తూంటాడు. మనం అతని స్వభావంలో పాలుపొందుతాం. ఏలాగ?
పిత పత్రుడైన వార్త మన మానుష దేహాన్ని స్వీకరించి క్రీస్తుగా జన్మించాడు. మనం క్రీస్తులోనికి జ్ఞానాస్నానం పొందినపుడు అతనితో ఐక్యమౌతాం. క్రీస్తు స్వీకరించింది ఓ ప్రత్యేక మానుష దేహాన్ని మాత్రమే కాదు. మానుష వ్యక్తులమైన మనలనందరినీకూడ. అతనితోగూడి మన మందరము ఒక్క జ్ఞాన శరీరమౌతాం. అతడు పరలోక పితకు పత్రుడు. ఈ పత్రునితో ఐక్యమైన మనమూ ఈ పత్రుని ద్వారా పరలోకపు తండ్రికి దత్తపుత్రులమరొతాం.