ధర్మశాస్రాన్ని గ్రహించి పూర్వవేద ప్రజలకు ఇచ్చాడు. క్రీస్తు నూత్న వేదపు మధ్యవర్తి ధర్మశాస్తానికి మారుగా క్రీస్తు తన కృపనే మనకు అనుగ్రహించాడు. కావుననే “అతని పరిపూర్ణతనుండి మనమంతా కృపకు బదులుగా వేరొక కృపను పొందాము" అని చెప్తుంది యోహాను సువార్త 1, 16. తొలి కృప మోషే ధర్మశాస్త్రం. దానికి బదులుగా మనం పొందిన కృప క్రీస్తు వరప్రసాదం. ఈ కృపకే సత్యం, వరప్రసాదం అనే విశేషణాలు రెండు వాడబడ్డాయి. ఇక్కడ వరప్రసాదమంటే, పరలోకపిత క్రీస్తు ద్వారా మనలను రక్షించడం. సత్యమంటే పరలోకపిత ప్రజలను రక్షిస్తానని తాను పూర్వమే చేసిన ఒడంబడికను క్రీస్తుద్వారా నెరవేర్చుకోవడం.
ఈ క్రీస్తుని అందరూ అంగీకరించరు. అంగీకరించిన వాళ్ళకు మాత్రం క్రీస్తు తన పత్రత్వంలో పాలిస్తాడు-1, 12. ఇక్కడ అంగీకరించడమంటే క్రీస్తుని విశ్వసించి అతని లోనికి జ్ఞానస్నానం పొందడం. అలా చేసినవాళ్ళు క్రీస్తు కృపకూ పత్రత్వానికీ పాత్రులౌతారు, ఈ పాత్రతవలననే పరలోకపితకు పుత్రుల మౌతున్నాం.
యూదులు యావేను తండ్రి అనికాక యజమానుడు అని పిలిచేవాళ్ళు ఆ భగవంతునిపట్ల వారికి పెద్ద చనువులేదు. అతడుకూడ నరావతారమెత్తి వాళ్ళ మధ్యలో జీవింపలేదు. యూదులు అతడు మహా పవిత్రమూర్తి అనీ, పాపులమైన మనకూ అతనికీ చాలా అంతరముంటుందనీ చెప్పేవాళ్ళ అందుకే యావేను కంటితో చూచినవాళ్ళ బ్రతకరని అనుకొనేవాళ్ళ-నిర్గ 33,20. భగవంతునికీ మానవునికీగల ఈ యంతరాన్ని తొలగించడానికే క్రీస్తు వచ్చింది. అతని నరావతారం ద్వారా దేవుడు మన మానవలోకంలో అడుగు పెట్టాడు. మానవులు కూడ దేవుని దగ్గరకు వెళ్ళగలిగారు. అతని ద్వారా పరలోకపిత మనకందరకూ సన్నిహితుడయ్యాడు. కావుననే మనం ప్రతిదినం క్రీస్తు ద్వారా ఆ తండ్రిని *పరలోకంలో వుండే మా ඡoසී” అని చనువుతో పిలుస్తూంటాం. యూదులు దేవుణ్ణితండ్రి అని పిలువలేక పోయారు అన్నాం. అతడు యజమానుడు తాము బానిసలు అనుకున్నారు అన్నాం. కాని మనంమాత్రం అతన్ని తండ్రి అని పిలుస్తున్నాం. మనం అతని బిడ్డలమని చెప్పకొంటూన్నాం. ఎందుకు? యూదులనాడు క్రీస్తులేడు. వాళ్ళ అతనిలోనికి జ్ఞానస్నానం పొందనూ లేదు, అతనితో ఐక్యం కానూలేదు. ఈ భాగ్యాలన్నీనేడు మనకు లభించాయి.
3. పరిశుద్ధాత్మ - దత్తపుత్రులు
క్రీస్తుద్వారా మనం పత్రులమౌతాం అన్నాం. కాని ఈలా పుత్రులయ్యేలా చేసేది పరిశుద్దాత్మ ఈ యాత్మ క్రీస్తు వెళ్ళిపోయాక అతని కార్యాన్ని కొనసాగిస్తుంది.
పోలు, పరిశుద్దాత్మ మనలను పుత్రులనుగా చేస్తుందనీ, ఆ యాత్మవలన మనం దేవుని తండ్రి అని పిలువగల్లుతున్నామని చెప్పాడు - రోమా 8, 15. అతడే మరో తావులో పిత తన పుత్రుని యాత్మమైన పావనాత్మను మన హృదయాల్లోనికి పంపాడనీ ఆ