7. యావే ఒక్క నరజాతికి మాత్రమే కాక ఈ విశ్వానికంతటికీ రాజు, సృష్టికర్తయైన ప్రభువు జీవకోటికంతటికీ పాలకుడు. ఈ విశ్వమంతా అతని సాన్నిధ్యంతో నిండివుంది — యొష 6,3.
8. ప్రవక్తల కాలంలో యావే ప్రభువును గూర్చి రెండు భావాలు ప్రచారంలోకి వచ్చాయి. మొదటిది, అతని రాజ్యం అంత్యదినాల్లో బాగా వ్యాప్తిలోకి వస్తుంది. రెండవది, అతడు ప్రజల హృదయాల్లో పరిపాలనం జేస్తాడు.
క్రీస్తుపూర్వం 587లో బాబిలోనియా రాజులు యూదుల రాజ్యాన్ని నాశంజేసారు. ఇక యూదులకు ఇహలోక రాజ్యం లేదు. కనుక ప్రవక్తలు అంత్యదినాల్లో యావే యిప్రాయేలును రాజుగా ఏలుతాడు అని బోధించారు. ఇంకా, యిస్రాయేలు రాజులూ ప్రజలూ కూడ నిరంతరం సీనాయి నిబంధనాన్ని మిూరుతూ వచ్చారు. కనుక ప్రవక్తలు అంత్యదినాల్లో ప్రభువు యిస్రాయేలీయుల హృదయాలను మారుస్తాడని బోధించారు. కనుకనే యెహెజ్నేలు ప్రభువు జనులలోని రాతిగుండెను తీసివేసి దానికి బదులుగా మాంసపు గుండెను దయచేస్తాడని చెప్పాడు. అనగా అతడు అవిధేయులైన యిస్రాయేలీయులను విధేయులనుగా మారుస్తాడని భావం. వాళ్ల హృదయాల్లో తాను రాజ్యం చేస్తాడని అర్థం - 36, 26-27.
ప్రవక్తలు భవిష్యత్తులో రానున్న దైవరాజ్యానికి చాల వుపమానాలు వాడారు. ఆ రాజ్యం నూత్నసృష్టి, నూత్న నిర్గమనం. ప్రభువు గొర్రెల కాపరికాగా ప్రజలు అతడు మేపే మంద ఔతారు — యొష 39,11. యావే తన ప్రతినిధియైన మెస్సీయాను పంపి అంత్యకాలంలో దైవరాజ్యాన్ని స్థాపింపజేస్తాడు.
ఇంకా ప్రభువు అంత్యకాలంలో సియోను కొండమిూద సింహాసనాన్ని స్థాపించుకొని లోకంలోని జాతులనన్నిటినీ ఏలుతాడు. ఈ కొండమిూది నుండే అతడు ధర్మశాస్తాన్ని బోధిస్తాడు. దాన్ని నేర్చుకోవడానికి లోకంలోని సకలజాతి ప్రజలు యాత్రికులుగా సియోనుకి వస్తారు -
"ఆ ప్రజలు ఈలా పల్ముతారు
మనం ప్రభువు పర్వతానికి వెళ్లాం
యాకోబు దేవుని దేవళానికి పోదాం
అతడు తన మార్గాలను మనకు బోధిస్తాడు
మన మతని త్రోవలో నడుద్దాం
ధర్మశాస్త్రం సియోనునుండి వస్తుంది
ప్రభువు వాక్కయెరూషలేమునుండి బయల్దేరుతుంది" - యెష 2.2-3.