పుట:AndhraRachaitaluVol1.djvu/563

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నరసింహశాస్త్రిగారి వాణి నేడు దేవీభాగవత రచనలో బరిణతమై యున్నది. అందలి సుందరధోరణి యీతీరు గలది.

శా|| ఆలీలన్ శుకయోగి తండ్రిదరి గార్హస్థ్యంబు వెళ్ళించి పై
కైలాసాచల శృంగభూమి పితృసంగంబున్ వధుసంగమున్
బాలాపుత్ర సమస్త సంగతులు పోనంబెట్టి నిశ్చింత మే
ధాలక్ష్యం బగుపేర్మి నిశ్చలత నాత్మధ్యానియై నిల్చినన్.

శా|| అంతం గొండొకకాల మేగ శుకు డాత్మారాముడై సిద్ధుడై
వింతం గొల్పుచు సర్వభుతములకున్ విద్యుత్ప్రభాపుంజ భా
స్వంతుండై సెనసెన్ విహాయసిని భాస్వద్బింబ సంభేదియై
భ్రాతంబై గిరిశృంగ మచ్చట ద్విధా వ్రయ్యంగ నుత్క్షిప్తమై.

మ|| సకల త్రైదశ మౌనిసిద్ధ బహుధా సంస్తూయమాన ప్రథన్
శుకు డాకాశపథంబునందు పృషదశ్వుండట్లు స్వచ్ఛందుడై
ప్రకటాశాళి ద్వితీయ భాస్కరుని ఠేవన్ వెల్గుచుం బోవ, తం
డ్రికి నుత్పాత పరంపరల్ కనబడెన్ భీశోకముల్ కూర్చుచున్.


ఇట్టి హృదయంగమ శైలిలో దేవీభాగవతము నాంధ్రీకరించు శ్రీ నరసింహశాస్త్రిగారికి ' కవిసామ్రాట్ ' బిరుదముతో దేశము సత్కరించినది. సాహితీసమితి కార్యదర్శిగా వారు చేయు సాహిత్య ప్రచారము విశేషించి గౌరవార్హము.