పుట:AndhraRachaitaluVol1.djvu/545

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చీ సంరక్షింపగ స
న్న్యాసి పటాటోప మట్టు లర్థింత్రు జనుల్.

క. విడిది నికుంజాంతరముల
బడక శిలాతలములందు; బ్రాశము బిసముల్
మడుగులు నారలు కాగా
గడగిరి తపమునకు నియతగతి నా భ్రాతల్.

శా. సాయాహ్నంబుల దమ్ములంద ఱొకవృక్షచ్ఛాయ గూర్చుండగా
బ్రేయశ్శ్రేయములం గురించి యతి గంభీరం బుపన్యాసముం
జేయుం ; దేల్చును దారతమ్యమును దజ్జేష్ఠుండు; వారెల్లరుం
బీయూషంబును గ్రోలు చందమున దృప్తింబొంది హర్షింపగన్.

ఇది జాతకథా గుచ్ఛమునందలివి. ' వివేకానందము ' నుండి మరి మూడు :-

మ. అడుగంటెన్ మన భారతీయమగు విద్యల్ ; పుచ్చిపోయెన్ గడున్
గడు ధర్మంబులు ; వేషభాషణములుం బాశ్చాత్యలోకంపు బో
కడలన్ మైలపడెన్ ; సమస్తజనలక్ష్యం బర్థకామంబులై
పెడదారింబడె; బూతిగంధియగు నీ విశ్వం బిసీ! కన్పడున్.

తినగా మూల్గుచు నెంగికులపయిన్ దీర్పంగ బెన్దప్పినిం
జనుచున్ సీ ! గవులారు గుంటలకు, వృక్షచ్ఛాయలంబండు చెం
డన్ వానన్, మెయి జింకిపాతలను మాసంబెట్లొ ! రక్షించు కొం
చును జీవించెడి పేదలం గనగ జించున్ దుఃఖ మీడెందమున్.