పుట:AndhraRachaitaluVol1.djvu/546

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చాలున్ మూలము లేని సాంఘక దురాచారంబులే యయ్యె బో
మేలుబంతులు జాతికీ భరతభూమిం; దత్పురోవృద్ధికిన్
ఆలోచింపగ వేరుబుర్వులు మఠాధ్యక్షుల్ ; పురోధోగణం
బేలా, పెక్కులు ! దయ్యముల్ కరణి నెంతే బట్టిపల్లార్చెడిన్.

ఏవంవిధముగా మధురమైనదియు మృదువైనదియు సాధువైనదియు నగు కవితారచనతో శ్రీ సూర్యనారాయణ శాస్త్రిగారు పెక్కు కబ్బములు సంతరించుచున్నారు. నిజాంరాష్ట్రమున, ఆంధ్ర సారస్వత పరిషత్తువారి మాహాదరణ గౌరవములకు వీరు పాత్రులయినారు. యావదాంధ్రమున వీరి రచనలు ప్రాకు చున్నవి. మహబూబు కాలేజీలో తెలుగు పండితులై మూడు దశాబ్దులనుండి శిష్యుల నెందరినో తీర్చి దిద్దుచున్నారు. వీరు సాహిత్య శిరోమణి, విద్వాన్, పి.పి.యల్. మున్నగు పట్టములు వడసినారు. సకల సౌభాగ్య సంపన్నులై, పండిత కవులై విరాజిల్లుచున్న సన్నిధానము శాస్త్రిగారి సారస్వత జీవితము చక్కనిది.