పుట:AndhraRachaitaluVol1.djvu/511

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిపూర్ణ పావనాంభ స్తరగోద్వోగ

గౌతమీ గంభీర గమనమునకు

ఆలంపురీ నందనారామ విభ్రౌజి

మల్గోబ ఫలరాజి మధురరుచికి

ఆంధ్రీ కుమారీ సమాయుక్త పరిపూత

తుంగా వయస్సు మాధుర్యమునకు

ఖండ శర్కర, జాతి, ఖర్జూర, గోక్షీర

ద్రాక్షాదియుత రామ రసమునకును

అమృత నిష్యంది వల్లకీ హ్లాదమునకు

రాగిణీ దివ్య సమ్మోహరాగమునకు

తేనెతేటల నవకంపు సోసలకును

సాటి యగును మాతెనుగు భాషామతల్లి.

'ప్రణయని' పై వీరు కట్టిన కవిత యెట్టులున్నదో యరయవచ్చును:

ఉ.నీ నునుజెక్కులున్ మరియు నీ చిరునవ్వును దంతకాంతియున్

నీనయగారముల్ కలికి! నీదు మీటారపు గుబ్బదోయియున్

నీనడయాడుకౌ నరయ నీచికురంబును కెంపుమోనియున్

చానరొ! నాటె నాయెడద సంశయ ముండిన చీల్చి చూడుమా!

ఉ. ఎచ్చటి కేగినన్ మరియు నేమి యొనర్చిన నీదురూపమే

యిచ్చ దలంచుచుండు, కృపయించుక పూన వదేమొ, ఓర్వగా

వచ్చునె యీమనోవ్యధల వారిజలోచన! నీకటాక్షమున్

నచ్చితి నింక తాళగలనా, లలనా! చలమూస పాడియే!

ఉ. నీ సరసంపు ముచ్చటలు నీతరళాయిత నేత్రయుగ్మమున్

వీసరవోని మోహమున నేమరు చిత్తములో స్మరించుచున్

వేసర కెల్లవేళలను ప్రేయసి! నిన్ గనగోరునాకయో!

ఆసలుగొల్పి యేచడగునా, మగువా! వగ హెచ్చుచున్నదే!