పుట:AndhraRachaitaluVol1.djvu/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాల్యంబున గవిత్వపటిమ చూవ నొనర్చె

మృదులకాళిందీ పరిణయకృతిని

సంస్కృతకవితోరుసామర్థ్య మెఱిగింప

విరచించె శంబరానురవిజయము

శబ్దార్థముఖచిత్ర సరణికై శంతనూ

పాఖ్యాన నామకావ్యం బొనర్చె

రూపకకవితను జూప ముక్తావళి

రచియించె సంస్కృతాంధ్రములయందు

కల్పితకథాపటిష్టత దెల్ప జిత్ర

సీమ గల్పించె మఱియును జేసె బెక్కు

లెట్టి కవితను నిర్మింపనేని దగడె

రామపదనేవి భద్రాద్రిరామశాస్త్రి.

శాస్త్రిగారు ముక్తావళి యనునాటకము తెనుగుభాషలోను, సంస్కృతభాషలోను రచించుట మెచ్చదగినది. తెనుగు ముక్తావళిలోని పద్యములు ముత్యములు.

చ. పడకొదవంగ గొంచెముగ వంగిన గాత్రమునందు వన్నక

ప్పడమును గ్రమ్మి పెన్విరహభారముచేత గృశత్వమంది యి

ప్పడతున్ గ్రీష్మమేగుతఱి వారిదగర్భమునందుగోన వ

చ్చెడు తొలిమించుపోల్కి గడుచిక్కియు గన్నులపండు

వయ్యెడున్.

                          _________________