మలయమారుతుడు : నాకు జన్మేలా
నాదుప్రేయసి నన్ను చేరని నాదుజన్మ్యేలా?
గంధవతి : ప్రియుని కౌగిలివీడి బ్రతుకే లా నాతికి
ప్రేమ ఈయని వరములుండేలా ?
బాలురు : వలపుచేడియ కౌగిలే
బ్రతుకుమార్గపు వెన్నలా
ప్రణయనీమృదులా ధరమ్మే
ప్రాణమిచ్చే అమృతమే
బాలికలు : నాథుని హృదయము జీవాధారము
నాధునిప్రేమే ఆత్మాధారము
వసంతుడు : మీమీ మాటల
మించెను దుఃఖము
అందరు : దుఃఖమేలా ఆమనీ
దోయిలింపుము భూమినీ!
వసంతదేవుడు సమభంగాకృతియై, పద్మాసనాసీనుడై చిమ్మద్రాంకిత హస్తుడై కన్నులరమూతలుగా తపస్సు అభినయిస్తాడు.
ఆకాశవాణి : నీ తపసు ఫలియించెనోయీ ఆమనీ
చేతనుడవై నిలువుమోయీ
అందరు : ఏదోవెలుగూ ఏదో సౌరభ
మేదోదర్శన మదె వచ్చెన్!
రంగస్థలానికి మధ్యగా ఉన్న ఒకపెద్దగంపతేలి మాయమయిపోతుంది. ఆ స్థలంలో తారానిక వనదేవి వేషాన సహస్రదళ పద్మం మధ్య కూర్చుండి ప్రత్యక్షమౌతుంది. వసంతుడు కన్నులు నెమ్మదిగా తెరుస్తూ పులకరం అభినయిస్తాడు. ఎదురుగా వనదేవిని చూస్తాడు.
“ఓహో! ఏదో ఆనందం
ఆహా! అలమెను నన్నూ
ఎవరో ఈ దివ్యదర్శనము
ఎవరో ఈ పరమ దర్శనము
సౌందర్యాలూ మూర్తించినవీ
సర్వమునన్నిటు ముంచెత్తినదీ
ఆపలేను నా చివరవాంఛితమును
ఓపలేను ఈ విరహవేదనను
వనదేవి కన్నులు తెరుస్తూ : ఎక్కడనుండీ ఇక్కడతేలితి
ఏమయ్యెను నా ప్రాణేశుండూ
అడివి బాపిరాజు రచనలు - 6
152
అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)