ఆనందనృత్యాల
అఖిల లోకమ్మలరు
గంధవతి, మలయమారుతుడు : మధుమూర్తి ఈ రీతి
మనసు కలతైతే
మా ఒడలు వేడెక్కి
మరిగిపోయేము!
బాలికలు, బాలురు : ఆమనికి శోకమూ
ఆశ్చర్యమయ్యే
ఆమనికి దుఃఖమే
అంత్య కాలమ మాకు.
(8)
వసంతుడు ఆ త్రిభంగాకృతి పీఠముపై అధివసించి ఆవేదన అభినయిస్తు ఉండును. రతీ మన్మథులు, గంధవతీ మలయమారుతులు, బాల బాలికలు వసంతుని అనునయించే నాట్యం చేస్తూ, పాటపాడగానే ఆ దివ్యమూర్తి,
“వికల మొందె హృదయమయ్య
శకలమయ్యె ఆనందం
తెలియరాని భావమొకటి
నిలువెల్లా కూల్చేనో!"
అని పాడుతూ తలవంచాడు.
రతి : ఈ రీతినే నా దుఃఖం
ఏడుజగాలను నిండీ
మండించెను గరళమ్మయి
మసిచేసెను మాంగల్యము
మన్మధుడు : ఓయి వసంతా ఉపశమించుమా
నాయికలేనీ నాయకుడీవే!
దేవీ సహితుడు దేవుడె పూర్ణుడు
దీనుడు ఒంటిగ ఉంటే అమరుడు
లక్ష్మి హృదయమునలేని విష్ణువు
లలితార్థాంగుడుకాని శివుండు
తలపులకయినా అందని భావము
తపసులనయినా చేరని మోక్షము
రతి : గంధములు లేనట్టి పూవులు
కాంతిరహితుడు సూర్యబింబము
ప్రాణసతి లేనట్టి వ్యక్తే
అడివి బాపిరాజు రచనలు - 6
151
అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)