మన్మథుడు : ప్రణయినీ నాతనువు
భగ్గుమని మండగా
రూపరహితుడనై
రోదించిపోయాను
ఇంతలో నాశక్తి
ఇలనిండె దెసనిండె
విశ్వమంతా నిండి
శాశ్వతమ్మయి నిలిచె!
రతి : నాథ మిముగానకే
భాధపడి కూలితిని
రోదించి రోదించి
రుద్రునే తిట్టితిని
దేవతలు విచ్చేసి
దీనులై నిలిచారు
“తల్లీ! నీ నాథుండు
ఎల్లఎడ నిండాడు
తిరిగి వచ్చేనమ్మ
తిరిగి వచ్చేను
ప్రతియేడు మధుమాస
ప్రారంభమందు
ఈ రహస్యము నెరిగి
ఓ రతీ నీవు
ఆమనితో వేచి అరయు" మన్నారు!
మన్మథుడు : అడుగొ దేవీ వసంత దేవుడు
అచ్చట దీనత కూర్చున్నాడు
చేష్టలు దక్కీ
చిన్న తనముతో
అతడే చిహ్నము నిత్యసృష్టికీ
అతడే కలిపెను మనలనిద్దరా
కనుగొందామె కాంతా రావె
కలకలనవ్వుల తేలించెదమే!
రతి, మన్మథులు : ఏమోయి ఆమనీ
ఈ రీతి నున్నావు
అడివి బాపిరాజు రచనలు - 6
150
అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)