ప్రేమించేటి ముహూర్తమొచ్చే
ప్రేమవాహినుల తేలండీ!
మన్మథుడు : పూలశరాలూ విసిరివేసెదా
తూలిపోకుడీ నవయౌవనులూ
ఏదోబాధా తీయని గాధా
వేదనముంచే అన్వేషణలూ
బాలురు : వసంతదేవా రావయ్యా!
వసుధకు ప్రాణములీవయ్యా!
వసంతుడు ఆనందనృత్యంచేసి బాలుర కడకువచ్చి వారిపై ఆశీర్వాద హస్తముంచి.
“భయమేలనయ్య
బాలకులు మీకూ
దయకలిగె వరమిత్తు
తలలెత్తి తెల్పుడీ!
బాలురు : మాకేమి కావాలొ
మనసులకు తట్టదే
హృదయాలు ఉప్పొంగు
కదిలేను కాంక్షా
మన్మథుడు : తెలుసునయ్య
తెలుసునయ్య
తేటతెల్లమై
పాటుపోటులై
యువతినికోరే యువకులురండీ
రండమ్మా బాలికలూ
దండలనే వేయండీ
తలపులతో పొంగండీ
వలపులతో కరగండీ.
గలగల నాట్యమాడుతూ బాలికలు వత్తురు. బాలురు. బాలికలూ కలిసి ప్రణయ నృత్యం సలుపుతారు. బాలికల జట్టునాయిక రతీదేవి. ఆమె ప్రక్క గంధవతీ. రతీ మన్మథుని కడకూ, గంధవతి మలయమారుత కుమారుని కడకూ నాట్యాన వచ్చి వారితో కలిసి నృత్యం సలుపుతారు.
రతి : నాథ, మన్మథా
నర్మ మథురమూర్తి
ఎన్నాళ్ళకో నిన్ను
కన్నార కాంచితిని!
అడివి బాపిరాజు రచనలు - 6
149
అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)