ఏమిటో ఆలోచిస్తూ కూచున్నది ఇంతలో వసంతోత్సవపు విందుకు రమ్మదంటూ యశోద వచ్చింది.
“ఇందతా ఏమిటీ యశోదా?” అని తీవ్రంగా అడిగినట్లు అడిగింది.
“ఏమో నాకేమి తెలుసును?”
“తెలియకుండా నువ్వు ఆ నగపెట్టె ఏలాపట్టుకు వచ్చావు?”
“మా అమ్మ చెప్పినట్లు అదిచేశాను.”
“అంతేగాని నీకేమీ తెలియదు?”
“మా మేనమామ విజయపురం నుంచి వచ్చాట్ట!”
“వచ్చి?"
“వచ్చినవార్త విన్పించాట్ట.”
“ఏ వార్త ?”
“వివాహం వార్త!
“ఏ వివాహం ?”
“మా అన్నయ్య వివాహం!”
“ఎప్పుడుట?” గబుక్కున ఆమె గుండెలల్లో రాయిపడింది. మళ్ళీ ఇదంతా తన్ను మాయచేసేడే అని అర్థం అయి పకపక నవ్వు వచ్చింది.
“ప్రధానం త్వరలో అవుతుందట!”
“ఎవరి ప్రధానం!”
“నీ ప్రధానం!”
“నా ప్రధానమేమిటి!”
“నీ ప్రధానమేనట. మీ నాయనగారు మా మాయయ్యచేత శుభవర్తమానం పంపించారు.”
“ఎప్పుడూ?”
“నిన్న సాయంకాలం మా మామయ్య విజయపురం నుంచి రాలేదు మరీ?”
“మా నాన్నగారిని ఎందుకు కలిశారు? ఏలా కలిశారు?”
“మా అన్నయ్య, మా నాన్నగారు ఆలోచించి మా మామయ్యను నీ పెళ్ళి విషయం కనుక్కోడానికి పంపారు!” యశోద పక పక నవ్వింది.
“నా పెళ్ళి విషయం మీకందరికీ అవసరం ఎందుకూ?” తార దొంగకోపం అభినయించింది.
“మా అన్నయ్యకు కాబోయే పెళ్ళానివిగనుక!”
“ఎవరన్నారూ ఆ ముక్కంట?”
“నువ్వు!”
“నేనా?”
“నేనూ!”
“నువ్వా?”
అడివి బాపిరాజు రచనలు - 6
143
అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)