పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరసవాణి

ఈపండిత తనభర్తయగు మండన మిశ్రుఁడు శంకరాచార్యులవారితో వాదముచేసి యోడిపోఁగాఁ దా నాచార్యులతో వాదించెను. ఈమెకుఁగల యసమానపాండిత్యమును సౌందర్యమును గని లోకు లీమెను సరస్వతి యవతారమని తలఁచిరి. అందువలన వా రామెను ఉభయభారతి యని పిలుచు చుండిరి. (ఈమె యాదిశంకరుల వారితో సమకాలీనురాల యినందువలన శంకరులవారి కాలనిర్ణయమే యీమె కాలనిర్ణయమని వేరుగఁ జెప్పనక్కఱలేదు. ఆది శంకరులవారు క్రీ. శ. 7 వ శతాబ్దమునందుండిరని కొందఱును, 8 వ శతాబ్దమునందుండిరని కొందఱును, 9 వ శతాబ్దమునందుండిరని కొందఱును జెప్పుచున్నారు. కాని కొన్ని యాధారములవలన నాదిశంకరులవారు క్రీ. శ. 8 వ శతాబ్దాంతమునను 9 వ శతాబ్దాదిని నుండినట్లు పండితు లనేకులు నిర్ణయించియున్నారు.)

శోణనదితీరమునందుండు విష్ణు శర్మయను బ్రాహ్మణునకు సరసివాణి యొక్కతయె కూఁతురు. అందువలన నతఁడామెను కడుగారాబముతోఁ బెంచుచుండెను. తల్లిదండ్రు లామెకు సకలవిద్యలను నేర్పిరి, సాంఖ్య, పాతంజల, వేశేషిక, న్యాయమీమాంసా, వేదాంతములనెడి యాఱు శాస్త్రములును, వ్యాకరణాది షడ గములును, కావ్యనాటకములును,