పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కమలా దేవి

ఈమె సత్యవతి కాలము (సత్యవతి చరిత్ర చూచునది) నందే యుండెనని యూహింపఁబడుచున్నది. ఈమె భర్త ముర్షీదాబాదు సమీపమునం దొకగ్రామవాసియగు బ్రాహ్మణుఁడు; ఆయనపేరు జగన్నాధభట్టాచార్యుఁడు. ఈదంపతులకు ముగ్గురుపుత్రులుండిరి. మానసింహుఁడనెడివాఁడువీరికిఁ గొంత భూమి ధర్మార్ధముగా నిచ్చినందున వారు దానివలననే సుఖ జీవనము చేయుచుండిరి. కమలాదేవి శాంతసుశీలాది గుణములు గలదైనందున నాయూరివారంద ఱామెను మిగుల మన్నింపు చుండిరి. అప్పుడాదేశపు ప్రభుత్వము కంపెనీవారిచేతికిఁ గ్రొత్తఁగా వచ్చెను. ఆసమయమున నొకగొప్పక్షామము సంభవించినందువలన పంటలు పండక జనులు మిగుల హీనస్థితికి వచ్చిరి. ఇదే సమయమని తలఁచి దొరతనమువారి యుద్యోగస్థులు కొందఱు క్షామమువలనఁ బీడింపఁబడిన జనులను దాము విశేషముగాఁ బీడించి, మిగుల బాధ పెట్టుచుండిరి. అప్పటి దొరతనమువారికి నింకను మనదేశభాష తెలియనందున వారు ప్రజలకుఁ గలుగుబాధలను తెలిసికొనఁజాల కుండిరి. ఇట్టిసమయమున మర్షీదాబాదున గంగాగోవిందసింహుఁ డనుదుష్టుని యధికారము చెల్లుచుండెను. వాఁడుసుఖముగాఁగాలము గడపుచున్న జగన్నాధుని కుటుంబము నొక్కసారిగా దు:ఖసముద్రములోనికిఁద్రోచెను. అదెట్లనిన, వారి కాసంవత్సరము పంట