యెడల నే వివాహమునకొప్పుకొనెద"ననెను. గణపతిరావు గారందున కొడంబడగా గొన్ని దినములకు వివాహము జరిగెను. దేశాచారప్రకారము వివాహానంతరము యమునాబాయికి 'ఆనందీబాయి' యని యత్తవారు పేరుపెట్టిరి. పెండ్లియైనపిదప గణపతిరావురావుగారి యనుమతిప్రకారము, గోపాలరావు నిత్యము సాయంతనము కళ్యాణపట్టణమునకు వచ్చుచుండెను. ఆనందీబాయి కొంచెము చదువుకున్నదని తెలిసి గోపాలరావు మరాఠిపుస్తకములు కొనితెచ్చి ముత్తవచేత నామె కిప్పించి చదువునట్టు చేయించుచుండెను. రెండవ పెండ్లివాడగుటచే పిల్లదానిని త్వరలో భర్తగారితో మాటలాడ బురికొల్పసాగిరి. కాని ఆనందీబాయి కా కాలములో భర్తయనిన నొక వ్యాఘ్రమువలె దోచుటచే నామె మిగుల భయపడుచుండెను. గోపాలరావామె నెంతమాత్రమును భయపెట్టక బుజ్జగించియే చదువు మొదలయినవి చెప్పుచుండెను.
గోపాలరావు ఆనందీబాయికి విద్య నేర్పుట ఆయన మామగారి కెంతమాత్రమును సమాధానము లేదు. ఆయన తానందు కొడంబడినవాడగుటవలన నల్లునితో వేమియు ననజాలక యితరులచే స్త్రీవిద్యవలనంగలుగు నష్టములు చెప్పించి మాన్పజూచెను. కాని గోపాలరావు వారికి దన ప్రత్యుత్తరము చెప్పి పంపెను. మామగారి యూరికి సమీపమునందుండిన యెడల భార్యవిద్య సాగదని గోపాలరావు అల్లీ బాగను గ్రామమునకు మార్చుకొనెను. అచటికి ఆనందీబాయితోడ నామె