పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొని రాజుయొక్క ఖడ్గమును ముద్రికను సింహాసనమునందుంచి శివదేవయ్య సాహాయ్యమున రుద్రమదేవి రాజ్యము చేయసాగెను. ఆమె రాజ్యము బహుయోగ్యముగా జేసెనని చెప్పుదురు. అప్పుడామె యోరుగంటి చుట్టును మూడు నాలుగు ప్రాకారములుగల కోటను శత్రువుల కభేధ్య మగునటుల గట్టి దానికి దగిన చోటుల సైన్యముల నుంచెను. అందువలన నా రాజ్యమును గెలుచుట బహుదుస్తరమని పెరరాజులు వెరచు చుండిరి. ఇదిగాక రుద్రమదేవి చేయు న్యాయపరిపాలనమువలన జను లామె రాజ్యమే శాశ్వతముగా నుండ గోరుచుండిరి.

ఈమె తనరాజధానిలో ననేకములైన చెరువులు త్రవ్వించియు, సత్రములు కట్టించియు జనోపయోగ్యములయిన యనేక కార్యములను చేసెను. బీదవిప్రులకు బంగారపు కొమ్ములుగల గోవు లనేకములు దానమిచ్చెను. అనేక దేవస్థానములు కట్టించి వాని కన్నిటికిని వృత్తుల నేర్పరచెను.

ఒకసారి రుద్రమదేవి యుమ్మక్క సహితమయి మొగలిచెర్లకు బోయి యచట వీరాశక్తిని బూజించుచు నైదుదివసంబు లచట వసియించెను. అప్పు డామెపైకి హరిహరదేవుడును, మురారియు దిరగబడగా వారి నపుడు సామంబునం దనలోనం జేర్చుకొనియె. తదనంతరము రుద్రమదేవి యోరుగంటి కోటలోనికి వచ్చి, హరిహరుడును మురారియును జేయు కపటము